Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య అభిమానులకు సాలిడ్ అప్డేట్.. ‘వీరసింహారెడ్డి’లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్.!

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహా రెడ్డి’పై అంచనాలు పెరుగుతున్నాయి. చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా తాజాగా సాలిడ్ అప్డేట్ అందింది.
 

Solid Update from Balakrishnas Veera Simha Reddy!
Author
First Published Oct 27, 2022, 4:26 PM IST

‘అఖండ’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna). ప్రస్తుతం ఆయన తదుపరి యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy)తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మాలినేని  డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య అభిమానులు మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ కూడా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. 

ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా కీలక షెడ్యూల్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికే  చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ మేరకు మేకర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ చిత్రాలంటే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్ని ఉంటాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. వాటిని రీచ్ అయ్యేందుకు మేకర్స్ తగినంతగా కష్టపడుతున్నారు. మాస్ డైలాగ్స్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్, సాలిడ్ యాక్షన్, మాసీవ్ టైటిల్. ఇప్పటికే బాలయ్య ‘గాడ్ ఆఫ్ మాసెస్’గా మారిపోయిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం బాలకృష్ణ, విలన్ మధ్య సాగే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఉత్కంఠభరితమైన పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కీలకమైన సమయంలో వస్తుందని, ఇదే కథను మలిపే కీలక సన్నివేశంగానూ  ఉండనుందని తెలుస్తోంది.  అభిమానుల అంచనాలను రీచ్ అయ్యేలా అద్భుతమైన రీతిలో రూపొందిస్తున్నారు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా గోపీచంద్ తెరకెక్కిస్తున్నారు. సినిమా కథ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో దునియా విజయ్ కూడా నటించగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios