గత ఏడాది విడుదలైన సీతా రామం చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్ లో మెమొరబుల్ మూవీ గా నిలిచిపోయింది. దుల్కర్ కి మాత్రమే కాదు.. దర్శకుడు హను రాఘవపూడి, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లకు కూడా ఇది స్పెషల్ మూవీనే.
గత ఏడాది విడుదలైన సీతా రామం చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్ లో మెమొరబుల్ మూవీ గా నిలిచిపోయింది. దుల్కర్ కి మాత్రమే కాదు.. దర్శకుడు హను రాఘవపూడి, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లకు కూడా ఇది స్పెషల్ మూవీనే. పరాజయాల్లో ఉన్న హనుకి ఈ చిత్రం జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మృణాల్ ఠాకూర్ ని క్రేజీ బ్యూటీగా మార్చేసింది ఈ చిత్రం.
విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించింది. అయితే తాజాగా సీతా రామం చిత్రంప్రతిష్టాత్మక అవార్డుని సొంతం చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం అయింది.ఈ నెల 20 వరకు ఈ వేడుక జరగనుంది.
శుక్రవారం రోజు పలు విభాగాలకు చెందిన అవార్డుని నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో ఉత్తమ చిత్రంగా సీతా రామం నిలవడం విశేషం. దేశ రక్షణలో భాగంగా పాకిస్తాన్ కి పెట్టుబడి ప్రాణాలు కోల్పోయిన సైనికుడి ప్రేమ కథని ఎంతో అద్భుతంగా జనరంజకంగా హను రాఘవపూడి తెరకెక్కించారు.
ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్.. మహాలక్ష్మిగా.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా అదరగొట్టేసింది. ఈ ఆగష్టు 5న సీతారామం చిత్రం విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది. రష్మిక మందన, సచిన్ ఖేడ్కర్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా ఐఎఫ్ఎఫ్ఎమ్ అవార్డుల వేడుకని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, హీరో కార్తీక్ ఆర్యన్, మృణాల్ ఠాకూర్, విజయ్ వర్మ ప్రారంభించారు.