Asianet News TeluguAsianet News Telugu

Gopichand: గోపీచంద్ ఖాతాలో ఎన్టీఆర్ కథ.. డైరెక్టర్ ఎవరో తెలుసా, జాక్ పాట్ కొట్టినట్లే

మాస్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'పక్కా కమర్షియల్' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నప్పటికీ మంచి వసూళ్లనే రాబడుతున్నట్లు సమాచారం.

Singam fame Hari to direct gopichand
Author
Hyderabad, First Published Jul 3, 2022, 10:18 AM IST

మాస్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'పక్కా కమర్షియల్' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నప్పటికీ మంచి వసూళ్లనే రాబడుతున్నట్లు సమాచారం. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎంతోకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కి నిరీక్షణ మరికొంతకాలం తప్పేలా లేదు. 

ఇక గోపీచంద్ తదుపరి చిత్రం ఏంటనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ నెక్స్ట్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది. జరుగుతున్న ప్రచారం ప్రకారం గోపీచంద్ తదుపరి చిత్రం సింగం దర్శకుడు హరి దర్శకత్వంలో ఉండబోతున్నట్లు టాక్. ఇది క్రేజీ న్యూస్ అనే చెప్పాలి. హరి లాంటి దర్శకుడి దర్శకత్వంలో నటించే ఛాన్స్ దక్కడం అంటే జాక్ పాట్ తగిలినట్లే. 

హీరో సూర్యకి తెలుగులో మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది సింగం సిరీస్. సూర్యని పోలీస్ ఆఫీసర్ గా హరి పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. ఇదిలా ఉండగా చాలా రోజుల క్రితం డైరెక్టర్ హరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రకటన రాకముందు హరి.. ఎన్టీఆర్ ని కలసి కథ వినిపించారు. ఎన్టీఆర్ కూడా కథ నచ్చడంతో ఓకె చెప్పారు. 

కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా మారిపోయాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విజయంతో ఎన్టీఆర్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితిలో ఆ కథని పక్కన పెట్టేయడం, ఎన్టీఆర్ కొరటాల చిత్రాన్ని ప్రకటించడం జరిగింది. దీనితో అదే కథని హరి మాస్ ఇమేజ్ ఉన్న గోపీచంద్ తో తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారట. ఇద్దరి మధ్య ఆల్రెడీ చర్చలు జరుగుతున్నట్లు టాక్. త్వరలోనే ఈ క్రెయి కాంబినేషన్ పై క్లారిటీ రానుంది. హరి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఏనుగు విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ హీరోగా నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios