Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి 2 సినిమాలకు శృతిహాసన్ కు ఎంత ఇచ్చారంటే...

ఈ రెండిట్లో కూడా శృతి హాసన్ హీరోయిన్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఈ రెండు సినిమాలకు కలిపి శృతి హాసన్ కు ఎంత పే చేసి ఉంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ShrutiHaasan was paid a whopping paycheck for sankranthi movies
Author
First Published Jan 22, 2023, 5:16 PM IST


ఈ సంక్రాంతికి తెలుగు నుంచి చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో బరిలోకి దిగారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో వచ్చి మంచి సక్సెస్ సాధించారు. ఈ రెండు సినిమాలకు  చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి.. రెండు సినిమాలని కూడా ఒక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. వాళ్ళే ఈ సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేశారు కూడా. ఈ రెండు సినిమాల డైరెక్టర్స్ కి దర్శకులుగా మొదట లైఫ్ ఇచ్చింది రవితేజనే. ఇలా సంక్రాంతికి రిలీజ్ కి ముందే చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయని అంతా భావించారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మరిన్ని కామన్ పాయింట్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రెండిట్లో కూడా శృతి హాసన్ హీరోయిన్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఈ రెండు సినిమాలకు కలిపి శృతి హాసన్ కు ఎంత పే చేసి ఉంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఈ రెండు సినిమాలకు కలిపి ఒకే ఎమౌంట్ కు శృతిహాసన్ ని మాట్లాడుకున్నారు. అదెంత అంటే 5 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. సీనియర్ హీరోల ప్రక్కన చేయాల్సి రావటంతో శృతికు అడిగినంత ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే శృతి కూడా డిమాండ్ చేసే పొజీషన్ లో లేదు. ఆమె సినిమాలు ఏమీ ఈ మధ్యకాలంలో వర్కవుట్ కాలేదు. క్రాక్ సినిమా ఒక్కటే సూపర్ హిట్ అయ్యింది. అదే దర్శకుడుతో కాబట్టి వీరసింహారెడ్డి ఒప్పుకుంది. అదే బ్యానర్ కాబట్టి ఆమెను వాల్తేరు వీరయ్యకు కూడా ఒప్పించారని సమాచారం.

ఇక బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.

గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేసారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేసారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios