హీరోయిన్పై అక్షయ్ కుమార్ బాడీ షేమింగ్ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన నటి
అక్షయ్ కుమార్, నటి శాంతి ప్రియా విషయంలో చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాడు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా శాంతి ప్రియా మోకాళ్ల పై వరకు ఉన్న డ్రెస్లో సెట్కు వచ్చింది. ఆ సమయంలో ఆమె మెకాళ్లు నల్లగా ఉండటం చూసిన అక్షయ్, నీకు అక్కడ రక్తం గడ్డ కట్టిందా అంటూ కామెంట్ చేశాడట.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు ఇండస్ట్రీ జెంటిల్మెన్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా ఇటీవల వరుసగా సందేశాత్మక సినిమాల్లో నటిస్తున్న అక్షయ్ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ పాజిటివ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే గతంలో అక్షయ్ పై కూడా ఓ హీరోయిన్ కొన్ని ఎలిగేషన్స్ చేసింది. తన మీద వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడంటూ అక్షయ్ గురించి చెప్పింది నటి శాంతి ప్రియ.
తాజాగా లాక్డౌన్ సమయంలో ఇండస్ట్రీకి సంబంధించి పాత విషయాలు చాలా తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అక్షయ్ కుమార్, శాంతి ప్రియా విషయంలో చేసిన కామెంట్స్ కూడా మరోసారి వైరల్ అయ్యాడు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా శాంతి ప్రియా మోకాళ్ల పై వరకు ఉన్న డ్రెస్లో సెట్కు వచ్చింది. ఆ సమయంలో ఆమె మెకాళ్లు నల్లగా ఉండటం చూసిన అక్షయ్, నీకు అక్కడ రక్తం గడ్డ కట్టిందా అంటూ కామెంట్ చేశాడట.
అయితే అక్షయ్ ఆ వ్యాక్యలు సరదాగానే చేసిన అక్కడున్నవారంత ఒక్కసారిగా నవ్వటంతో శాంతి ప్రియకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంతేకాదు అక్కడే ఆమె బోరున ఏడ్చేసింది. ఇదే విషయాన్ని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించింది. అయితే అదే వార్త మరోసారి తెర మీదకు రావటంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది శాంతి ప్రియ.
`నేను మీ అందరికీ ఒక విషయంలో క్లారిటీ ఇవ్వ దలుచుకున్నాను. ఆ రోజు అక్షయ్ నా విషయంలో చేసిన కామెంట్స్ సరదాగానే అని నాకు తెలుసు. ఆ వ్యాఖ్యలు నన్ను కాలం పాటు వెంటాడినా అక్షయ్ నన్ను ఇబ్బంది పెట్టాలని గానీ, అవమానించాలని గానీ ఆ వ్యాఖ్యలు చేయలేదని నాకు తెలుసు. నాకు ఆయన పనితీరు చాలా ఇష్టం` అంటూ క్లారిటీ ఇచ్చింది శాంతి ప్రియ. శాంతిప్రియ, అక్షయ్ కుమార్లు ఇక్కే పె ఇక్కా, సౌగంధ్ సినిమాల్లో కలిసి నటించారు.