రామ్ చరణ్ పిలిస్తే తప్పకుండా వస్తా.. షారుఖ్ ఖాన్ కామెంట్స్ వైరల్..
మరోసారి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు షారుఖ్ ఖాన్. చరణ్ చూపిస్తేనే తన సినిమా చూస్తానంటున్నాడు. ఇంతకీ షారుఖ్ ఆకామెంట్స్ ఎందుకు చేశాడు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా.. రిలీజ్ కు రెడీగా ఉంది. మూడు వివాదాలు.. ఆరు గొడవలు అన్నట్టు ఈ మూవీ ప్రమోషన్లు సాగుతున్నాయి. ఈక్రమంలోనే ఎన్ని వివాదాలు అయినా.. ఓపిగ్గా సినిమా ప్రమోషన్లు చేసుకుంటున్నాడు షారుఖ్. ఈక్రమంలోనే ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చిట్ చాట్ లు కూడా చేస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఈక్రమంలోనే షారుఖ్ కు తెలుగు అభిమాని నుంచి ఓ ప్రశ్న ఎదురయ్యింది.
ఈ సందర్భంగా ఓ తెలుగు అభిమాని నుంచి ఆయనకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. పఠాన్ రిలీజ్ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా థియేటర్కు మీరు వస్తారా అని అభిమాని అడిగాడు. ఆ యువకుడు అడిగిన ప్రశ్నకు షారుఖ్ కాస్త డిఫరెంట్ గా సమాధానం చెప్పాడు. ఆయన స్పందిస్తూ.. రామ్చరణ్ నన్ను ఏ దైనా థియేటర్ కు తీసుకెళ్తే తప్పకుండా వస్తా అని సమాధానం చెప్పాడు షారుఖ్ ఖాన్. దాంతో ఈ సమాధానంతో రామ్చరణ్ అభిమానులు ఫిదా అవుతున్నారు.
మొన్నటికి మొన్న పఠాన్ తెలుగు ట్రైలర్ ను కూడా రామ్ చరణే రిలీజ్ చేశారు. తన ట్విట్టర్ పేజ్ ద్వారా ట్రైలర్ రిలీజ్ చేసిన చరణ్.. పఠాన్ టీమ్ కు శుభాకాంక్షలు తెలపడంతో పనాటు.. షారుఖ్ ఖాన్ గురించి గోప్పగా రాశారు. పఠాన్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పిన చరణ్ బాబు.. ఈ విధంగా అన్నారు. షారుఖ్ సార్ మిమ్మల్ని ఇదివరకెన్నడూ చూడని యాక్షన్ అవతార్లో చూడటానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నానంటూ.. రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.
ఇక ఈ పోస్ట్ కు రిప్లై ఇచ్చాడు బాలీవుడ్ బాద్ షా... షారుఖ్ ఖాన్. చరణ్ కు థ్యాంక్స్ చెపుతూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. షారుఖ్ ఈ విధంగా అన్నారు... ధన్యవాదాలు మెగాపవర్ స్టార్... మీరు ఆర్ఆర్ఆర్ కోసం ఆస్కార్ అవార్డు సాధించి భారత్కు తీసుకొచ్చిన తర్వాత దానిని టచ్ చేసే అవకాశం తనకు ఇవ్వాలని రీట్వీట్ చేశాడు షారుఖ్ ఖాన్.
సిద్ధార్థ్ ఆనంద్ డైరక్ట్ చేసిన పఠాన్ సినిమాను యశ్రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానున్నాడ. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండగా..ఇప్పటికే దాదాపు 5 లక్షల టికెట్స్ అమ్ముడుపోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.