Asianet News TeluguAsianet News Telugu

ముప్పై ఏళ్ల సుధీర్ఘ జర్నీ.. ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిన షారూఖ్‌ ఖాన్‌..

షారూఖ్‌ఖాన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 30ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అభిమానులకు బిగ్‌ ట్రీట్‌ ఇచ్చారు షారూఖ్‌ఖాన్‌. 

shah rukh khan completed 30years cine journey big surprise give to fans from pathaan movie
Author
Hyderabad, First Published Jun 25, 2022, 4:33 PM IST

షారూఖ్‌ ఖాన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా తన ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన కొత్త సినిమా ఫస్ట్ లున్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన `పఠాన్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ మోషన్ పోస్టర్‌ని  విడుదల చేశారు. ఇందులో మాస్‌ లుక్‌లో అదరగొడుతున్నారు షారూఖ్. బేడీలున్న చేతిలో గన్‌ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో ఉన్నారు షారూఖ్‌. ఆవేశంతో కనిపిస్తున్నారు. ఆయన ఫేస్‌లో రక్తపు మరకలున్నాయి. 

పూర్తి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తుండగా, దీపికా పదుకొనె కథానాయికగా నటిస్తుంది. జాన్‌ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేడీని ప్రకటించారు. జనవరి 25న సినిమాని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు పెద్ద సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో `పఠాన్‌`ని కూడా హిందీతోపాటు తెలుగు, తమిళంలో మూడు భాషల్లో విడుదల చేయబోతున్నారు. 

ఇదిలా ఉంటే షారూఖ్‌ ఖాన్‌ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటి(జూన్‌ 25)తో 30ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్‌లో కింగ్‌ ఖాన్‌గా తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన 1992,జూన్‌ 25న `దీవానా` చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించడంతో షారూఖ్‌ బాలీవుడ్‌లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ కాలంలోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. 

మరోవైపు ఒక్కో సినిమాతో తన ఇమేజ్‌ని పెంచుకుంటూ వస్తోన్న ఆయన రొమాంటిక్‌ లవ్‌ `దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే` చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో షారూఖ్‌, కాజోల్‌ జంటగా నటించారు. ఈ సినిమా ముంబయిలోని మరాఠ థియేటర్‌లో ఏకంగా 12ఏళ్లపాటు ప్రదర్శించబడి రికార్డ్ సృష్టించింది.  

ముప్పై ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు షారూఖ్‌. ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. `జీరో` చిత్రం తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న షారూఖ్‌ మళ్లీ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో రాబోతున్నారు. `పఠాన్‌` చిత్రంతోపాటు అట్లీ దర్శకత్వంలో 'జవాన్‌' సినిమా చేస్తున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించనుంది. రాజ్‌ కుమార్ హిరాణీ తెరకెక్కించే 'డంకీ'లోనూ నటించనున్నాడు. ఇవే కాకుండా మాధవన్‌ 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్‌', అమీర్‌ ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చద్ధా', రణ్‌బీర్‌ కపూర్‌ 'బ్రహ్మాస్త్ర', సల్మాన్ ఖాన్‌ 'టైగర్‌-3' చిత్రాల్లో షారూఖ్‌ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios