Asianet News TeluguAsianet News Telugu

సెర్బియాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. 'సిటాడెల్' టీమ్ ఫొటోస్ వైరల్ 

స్టార్ హీరోయిన్ సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత నటిస్తున్న మరో వెబ్ సిరీస్ సిటాడెల్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కి ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది.

Samantha and Citadel team meets Droupadi Murmu dtr
Author
First Published Jun 8, 2023, 9:05 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత నటిస్తున్న మరో వెబ్ సిరీస్ సిటాడెల్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కి ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ యాక్షన్ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. 

ఈ వెబ్ సిరీస్ లో సమంత వరుణ్ ధావన్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. వీళ్ళిద్దరూ ప్రియాంక చోప్రా తల్లిందండ్రులుగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. 

Samantha and Citadel team meets Droupadi Murmu dtr

అదే క్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం సెర్బియా పర్యటనలో ఉన్నారు. దీనితో సిటాడెల్ టీంకి అక్కడ ద్రౌపతి ముర్ముని కలసి అవకాశం లభించింది. వరుణ్ ధావన్, సమంత ఇతర సిటాడెల్ టీం ద్రౌపది ముర్ముని కలసి కాసేపు ముచ్చటించారు. ఆమెతో తీసుకున్న ఫొటోస్ ని వరుణ్ ధావన్, సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VarunDhawan (@varundvn)

టీం సిటాడెల్ కి సెర్బియాలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసే అదృష్టం దక్కింది. ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము అని వరుణ్ ధావన్ పోస్ట్ చేశారు. ఇక సమంత 'మేడం ప్రెసిడెంట్' అంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. సమంత క్యూట్ హెయిర్ స్టైల్ తో కళ్ళజోడు పెట్టుకుని కొత్తగా కనిపిస్తోంది. 

సమంత ప్రస్తుతం సిటాడెల్ తో పాటు విజయ్ దేవరకొండ ఖుషి లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె చివరగా నటించిన శాకుంతలం చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios