బుర్రా సాయిమాధవ్ చేతికి చెర్రి-శంకర్ సినిమా.. ఇంకా ఐదు పెద్దవి
ప్రస్తుతం `వీరమల్లు` చిత్రానికి బుర్రా సంభాషణలు సమకూరుస్తున్న సాయి మాధవ్.. రామ్ – లింగు స్వామి సినిమాకీ రాస్తున్నారు. అలాగే బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమాకీ ఆయనే రచయిత.
టాలీవుడ్ లో దాదాపు పెద్ద సినిమాలన్నీ డైలాగు రైటర్ సాయి మాధవ్ బుర్రా దగ్గరకే చేరుతున్నాయి చేరుతున్నాయి. తాజాగా ఆయన చేతిలో మరో క్రేజీ ప్రాజెక్టు చేరింది. రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ గా బుర్రా సాయిమాధవ్ ఫిక్స్ అయ్యారు. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వచ్చింది.
భారీదనానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే శంకర్ దర్శకత్వంలో రూపొందే సినిమాకు డైలాగులు రాసే అవకాసం రావటంతో సాయి మాధవ్ చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం `వీరమల్లు` చిత్రానికి బుర్రా సంభాషణలు సమకూరుస్తున్న సాయి మాధవ్.. రామ్ – లింగు స్వామి సినిమాకీ రాస్తున్నారు. అలాగే బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమాకీ ఆయనే రచయిత. ఇప్పటికే ప్రభాస్ – నాగ అశ్విన్ సినిమా కూడా సాయిమాధవ్ చేతిలో ఉంది. మరిన్ని… భారీ ప్రాజెక్టులు కూడా బుర్రాని వెదుక్కుంటూ వెళ్తున్నాయి.
ఇక శంకర్, రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే...దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా. శంకర్ తొలిసారి నేరుగా తెలుగులో అదీ తెలుగు హీరోతో సినిమా తీస్తున్నారు. చరణ్ - శంకర్ కలయిక, పాన్ ఇండియా స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. శంకర్ చిత్రాల్లో కనిపించే భారీదనంతో పాటు, రామ్చరణ్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయట. ఇప్పటివరకూ రామ్చరణ్ చేయని సరికొత్త పాత్రలో శంకర్ చెర్రీని చూపించనున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో తారాగణం కూడా భారీగానే ఉండనుంది.
ఈ సినిమా గురించి దిల్ రాజు ఇప్పటికే...‘‘ఇది మాకొక మైలురాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై 50వ చిత్రంగా ఇంతకు ముందెప్పుడూ చూడని రెండు బలమైన శక్తులను కలిపి తెరపై చూపించబోతున్నాం. మెగా పవర్ స్టార్ రామ్చరణ్, ఇండియన్ సినిమా షో మెన్ శంకర్లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’’అని ప్రకటించి ఉన్నారు.