Vijayendra Prasad:గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఆర్ ఆర్ ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్
ఆర్ ఆర్ ఆర్ మూవీ రైటర్ విజయేంద్రప్రసాద్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు.
ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)థియేటర్స్ లోకి రావడానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఎంజాయ్ చేయడానికి ఎన్టీఆర్, చరణ్ అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేమికుడు ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడంతో రికార్డుల మోతమోగించడం ఖాయం అంటున్నారు. ఇక టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించడం కూడా మరొక కారణం.
ఫ్యాన్ వార్ నడిచే రెండు బడా కుటుంబాలకు చెందిన ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ కలిసి మల్టీస్టారర్ చేయడం నిజంగా పెద్ద విశేషం. దీనిని సాకారం చేసింది మాత్రం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ చారిత్రక వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని ఫిక్షన్ జోడించి ఆర్ ఆర్ ఆర్ కథ సిద్ధం చేశారు. ఎమోషన్స్, యాక్షన్స్ ప్రధానంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ సాగనుంది.
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ (Vijayendraprasad)కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అలాగే ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా పాల్గొనడం జరిగింది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా హైదరాబాద్ శ్రీ నగర్ కాలనీలో విజయేంద్రప్రసాద్ మొక్కలు నాటారు. నిన్న ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు దర్శకుడు రాజమౌళి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.