రీషూట్ లో ‘లవ్స్టోరీ’..లాస్ట్ మినిట్ లో ఎందుకీ రిపేర్లు?
కేవలం 10 రోజుల్లో ఈ రీషూట్ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాకి సెన్సార్ జరిగింది. రీషూట్లు చేసి, మార్పులు చేస్తే మరోసారి సెన్సార్ ముందుకు వెళ్లాలి.
‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ‘లవ్స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సారంగధరియా’ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇది. కరోనా వల్ల,ఓటీటి సమస్యలతో వాయిదా పడుతూ వస్తోంది. రీసెంట్ గా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రటీమ్ ప్రకటించింది. అదే రోజున ఓటీటిలో టక్ జగదీష్ రిలీజ్ ఉండటంతో పెద్ద యుద్దమే జరిగినట్లైంది. అలాగే ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.ఆంధ్రాలో టిక్కెట్ రేట్ల ఇష్యూ సాల్వ్ కాకపోవటంతో ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ లోగా శేఖర్ కమ్ముల ఈ సినిమాకి మళ్లీ రీషూట్లు మొదలెట్టినట్టు టాక్.
రీషూట్ నిమిత్తం నిజామాబాదా వెళ్లారని చెప్తున్నారు.కొన్ని సీన్స్ మరింత బెటర్ గా తీయాలన్న ఉద్దేశ్యంతో రీషూట్ జరుపుతున్నారని వినపడుతోంది. కేవలం 10 రోజుల్లో ఈ రీషూట్ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాకి సెన్సార్ జరిగింది. రీషూట్లు చేసి, మార్పులు చేస్తే మరోసారి సెన్సార్ ముందుకు వెళ్లాలి. సెప్టెంబర్ 30న కానీ అక్టోబరు1 న కానీ లవ్ స్టోరీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అప్పటికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. ఇలా రిపేర్లు మొదలెట్టారని చెప్పుకుంటున్నారు.
ఇక సెన్సిబుల్ అండ్ లవబుల్ సినిమాలకు పెట్టింది పేరైనా శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ చిత్రంపై ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నాగ చైతన్య విషయానికొస్తే.. వరుసగా మజిలీ, వెంకీ మామ సక్సెస్లతో మంచి జోరు మీదున్నాడు. ఇపుడు తన ఫ్యామిలీ ఇమేజ్కు తగ్గట్టు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు.
‘లవ్ స్టోరీ’ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ఓ ఊరు నుంచి పట్నానికి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథ ఇది.. శేఖర్ కమ్ముల ఈచిత్రాన్ని తనదైన వైలిలో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడుతాడట. చైతూ తెలంగాణ యాస ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. మరోవైపు సాయి పల్లవి కూడా మరోసారి తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతుంది.