Asianet News TeluguAsianet News Telugu

థ్రిల్‌ డబుల్‌.. `రాక్షసుడు`కి సీక్వెల్‌ః అఫీషియల్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ `రాక్షసుడు` చిత్రానికి త్వరలో సీక్వెల్‌ రాబోతుంది. దీన్ని అధికారికంగా ప్రకటించారు.

ramesh varma announced rakshasudu 2 with big hero  arj
Author
Hyderabad, First Published Jul 13, 2021, 12:25 PM IST

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `రాచ్చసన్‌` చిత్రాన్ని తెలుగులో `రాక్షసన్‌` పేరుతో రీమేక్‌ చేశారు దర్శకుడు రమేష్‌ వర్మ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా, అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాల్లో ఉన్న బెల్లంకొండకి మంచి హిట్‌ని అందించి ఊపిరి పీల్చుకునేలా చేసింది. నటుడిగానూ ఈ సినిమాతో మెచ్యూర్డ్ నటనని ప్రదర్శించాడు బెల్లంకొండ. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ తీసుకురాబోతున్నాడు రమేష్‌ వర్మ. 

ప్రస్తుతం `ఖిలాడీ` సినిమాని రూపొందించిన ఆయన `రాక్షసుడు 2`ని తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ స్టార్‌ హీరోతో ఈ సినిమా తీయబోతున్నారట. మరో అదిరిపోయే డబుల్‌ థ్రిల్లర్‌ని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తామని, పెద్ద హీరో నటిస్తారని వెల్లడించారు. అయితే బెల్లంకొండ స్థానంలో మరో హీరోని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి హీరోయిన్‌ మారుతుందా? ఆమె ఉంటుందా? అన్నది చూడాలి. ఏ స్టూడియోస్‌ ఫిల్మ్స్ పతాకంపై, హవీష్‌ ప్రొడక్షన్‌లో కోణేరు సత్యానారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందట.

Follow Us:
Download App:
  • android
  • ios