Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్ షూటింగ్ లో ‘ఆర్సీ15’ టీం సందడి.. బ్రేక్ టైమ్ లో రామ్ చరణ్, కియారా రచ్చ.!

‘ఆర్సీ15’ షూటింగ్  శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న చిత్ర యూనిట్ షూటింగ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. షూటింగ్ గ్యాప్ లో క్లిక్ చేసిన కొన్ని ఫొటోలను తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అభిమానులతో పంచుకుంది. 
 

Ram Charan and Kiara Advani enjoying with team of RC15 in New Zealand shooting Shedule
Author
First Published Nov 25, 2022, 5:05 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ15’. ప్రముఖ దర్శుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. గతేడాది చివర్లలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాల్ లో తొలి షెడ్యూల్ మొదలవ్వగా.. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పలు షెడ్యూళ్లు ముగిశాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత  రామ్ చరణ్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో ‘ఆర్సీ15’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ప్రస్తుతం RC15 చిత్ర యూనిట్ న్యూజిలాండ్ లో ఉంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.  వారం కిందనే న్యూజిలాండ్ కు వెళ్లిన ఈ యూనిట్ శరవేగంగా షూట్ ను జరుపుతోంది. ఈ మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ జిమ్ వర్కౌట్స్, న్యూ లుక్ కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఆర్సీ15’ సెట్స్ నుంచి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) మరిన్ని ఫొటోలను  పంచుకుంది. షూటింగ్ గ్యాప్ లో స్నాక్స్ తింటూ రామ్ చరణ్, కియారా యూనిట్ తో సందడి చేస్తున్న ఫొటోలను  పంచుకుంది. చెర్రీ, కియారా బర్గర్ తింటూ ఫొటోలకు క్రేజీగా పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 

పొలిటికల్ డ్రామాతో పాటు యాక్షన్ పరంగానూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చేలా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లను బట్టి రామ్ చరణ్ పవర్ ఫుల్ యాంటీ - కరప్షన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అవినీతి నిర్మూలన నేపథ్యంలో ‘ఆర్సీ15’ కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ భారీ చిత్రాన్ని రూ.2‌00 కోట్లతో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు శిరీష్ నిర్మిస్తున్నారు. ఖర్చుకు ఎక్కడా తగ్గకుండా సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలనే రూ.15 కోట్లతో ఒక్కసాంగ్ ను షూట్ చేయడంతో ఈ విషయం స్పష్టం అవుతోంది.  చిత్రాన్నికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios