Asianet News TeluguAsianet News Telugu

కీర్తి సురేష్‌ను క్రాక్‌ పిల్ల అన్న నిర్మాత.. ఎందుకంటే?

తాజాగా కీర్తి సురేష్ తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ఎగ్జైటింగ్‌గా చూస్తున్న ఫోటోను షేర్ చేసిన కీర్తి. `నిన్ను చూసిన ప్రతీ సారి నాలో ఆ ఎగ్జైట్‌మెంట్ కనిపిస్తుంది. కానీ ఈ సారి మాత్రం నా లాస్ట్‌ పేమెంట్‌ వల్ల ఈ ఎగ్జైట్‌మెంట్‌. మిస్‌ యు స్వప్న` అంటూ కామెంట్‌  చేసింది కీర్తి సురేష్.

Producer Swapna Dutt called Keerthy Suresh as Crack Girl
Author
Hyderabad, First Published Jul 25, 2020, 2:20 PM IST

మహానటి సినిమాతో కీర్తి సురేష్‌కు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. అలనాటి అందాల నటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించి కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. అంతేకాదు ఈ సినిమాను నిర్మించి స్వప్నదత్‌, దర్శకుడు నాగ అశ్విన్‌లతో ఎంతో క్లోజ్‌ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక సందర్బంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తన కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ సినిమాను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంది కీర్తి సురేష్‌. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ఎగ్జైటింగ్‌గా చూస్తున్న ఫోటోను షేర్ చేసిన కీర్తి. `నిన్ను చూసిన ప్రతీ సారి నాలో ఆ ఎగ్జైట్‌మెంట్ కనిపిస్తుంది. కానీ ఈ సారి మాత్రం నా లాస్ట్‌ పేమెంట్‌ వల్ల ఈ ఎగ్జైట్‌మెంట్‌. మిస్‌ యు స్వప్న` అంటూ కామెంట్‌  చేసింది కీర్తి సురేష్.

అయితే కీర్తి పోస్ట్ పై నిర్మాత స్వప్న దత్‌ కూడా ఆసక్తికరంగా స్పందించింది. `కీర్తి సురేష్ ఫాలోవర్స్‌ కోసం, ఈ పిచ్చి పిల్ల తన పేమెంట్‌ కూడా అడగదు` అంటూ కామెంట్ చేసింది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు స్వప్నా దత్‌, ప్రియాంక దత్‌. తొలి ప్రయత్నంగా ఎవడే సుబ్రమణ్యం సినిమాను రూపొందించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios