ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ ఫస్ట్ పోస్ట్..కత్తిలా ఉంది
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఎక్కౌంట్ తెరిచిన సంగతి తెలిసిందే. అయితే తెరిచిన వెంటనే తన ఖాతాలో ప్రొఫైల్ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్ చేయకపోవటం అభిమానులకు నిరాశకలిసిగించి. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్ పెట్టకపోయినా అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఎక్కౌంట్ కు ఎనిమిది లక్షలకు చేరువలో ఫాలోవర్లు ఉండటం గమనార్హం.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఎక్కౌంట్ తెరిచిన సంగతి తెలిసిందే. అయితే తెరిచిన వెంటనే తన ఖాతాలో ప్రొఫైల్ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్ చేయకపోవటం అభిమానులకు నిరాశకలిసిగించి. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్ పెట్టకపోయినా అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఎక్కౌంట్ కు ఎనిమిది లక్షలకు చేరువలో ఫాలోవర్లు ఉండటం గమనార్హం.
కేవలం ఎక్కౌంట్ కు యాక్టర్ ప్రభాస్ అన్న పేరు మాత్రమే పెట్టుకున్నా ....ఆ ఒక్క పేరు చూసి ఇంత మంది అభిమానులు ఖాతాను అనుసరించడం మొదలుపెట్టారంటే ‘బాహుబలి’కి ఉన్న ఫాలోయింగ్ ఎంతో అర్థమవుతోంది. దాంతో ఆయన బాహుబలి సినిమాలో పిక్ని ఫస్ట్ పోస్ట్ చేశారు.. ఆ ఫొటోను చూసి ‘కత్తిలా ఉంది’ అంటున్నారు ఫ్యాన్స్ . బాహుబలి సినిమాలోని ఈ ఫొటో కానీ,సీన్ కానీ బయిటకు రాలేదు. దాంతో ఈ ఫొటోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ప్రభాస్ అభిమానలు ఈ ఫొటోను తమ ప్రొఫైల్ గా పెట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’షూటింగ్ తో బిజీగా ఉన్నారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ ‘సాహో’కు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ . సినిమా మొత్తంలో ప్రభాస్ చేసే జెట్మ్యాన్ స్టంట్ హైలైట్గా ఉంటుందని చిత్రవర్గాలు అంటున్నాయి. ఈ సన్నివేశం ఉండాలని ప్రభాసే నిర్ణయించారట. ఇందుకోసం ఆయన హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ను నియమించుకున్నారు. అంతేకాదు.. సినిమాలో అన్ని యాక్షన్ సన్నివేశాలను, స్టంట్లను డూప్ లేకుండా ప్రభాసే చేశారని చెప్తున్నారు. ఆగస్ట్ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.