Radheshyam Song Update: ఫ్యాన్స్ కి ప్రభాస్ మరో గిఫ్ట్.. ఒక్క హృదయం రెండు హార్ట్ బీట్స్..
మరో అప్డేట్ తో వచ్చారు ప్రభాస్. `రాధేశ్యామ్` చిత్రం నుంచి మరో పాటని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఆ పాటకి సంబంధించిన డిటెయిల్స్ ని వెల్లడించారు.
పాన్ ఇండియా రేంజ్ నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిపోయాడు `డార్లింగ్` ప్రభాస్(Prabhas). ఇప్పుడంతా ఆయన్ని గ్లోబల్ స్టార్గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమా `రాధేశ్యామ్`(Radheshyam). ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు జోరు పెంచింది. అభిమానుల కోరిక మేరకు ఇకపై గ్యాప్ లేకుండా వరుసగా అప్డేట్లు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ విడుదలై సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
దీనికి మరింత ఊపు పెంచింది ఇటీవల విడుదలైన `ఈ రాతలే` సాంగ్. Radheshyam నుంచి వచ్చిన తొలిసాంగ్.. యానిమేటెడ్ వీడియో ఆద్యంతం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఊహించని విధంగా సినిమా ఉండబోతుందని, గతంలో ఎప్పుడూ చూడని విధంగా సినిమా ఉండనుందనే ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మరో అప్డేట్ తో వచ్చారు ప్రభాస్. ఈ సినిమా నుంచి మరో పాటని విడుదల చేయబోతున్నారు. `వన్ హార్ట్.. టూ హార్ట్ బీట్స్` అంటూ సాగే `లవ్ ఆంథెమ్` సెకండ్ సింగిల్ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం రేపు సోమవారం(నవంబర్ 29)న విడుదల చేయబోతున్నారు.
మొదటి సాంగ్ విషయంలో అనుకున్న టైమ్కి పాటని విడుదల చేయలేకపోయారు. ఇతర భాషల సాంగ్ మిక్సింగ్ విషయంలో నెలకొన్ని ఆలస్యం కారణంగా సాంగ్ విడుదల నాలుగు గంటల ఆలస్యంగా విడుదలైంది. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చిందనేలా ఉందా పాట. శ్రోతలను, ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రెండో పాట `ఒక్క హార్ట్ రెండు గుండె చప్పుళ్లు` అంటూ సాగే పాట టీజర్ని రేపు రిలీజ్ చేయబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి హిందీ వెర్షన్ పాటని, సాయంత్రం ఏడు గంటలకు తెలుగు, తమిలం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య ప్రేమని వ్యక్తం చేసేలా అద్భుతమైన మెలోడీగా సాగనుందని తెలుస్తుంది. దీనికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై యూవీ కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా దీన్ని నిర్మించారు. సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే.
also read: Akhanda: ఆ విషయంలో ఎన్టీఆర్ తర్వాత బాలయ్యనే: బన్నీ ప్రశంసలు.. రెండు రాష్ట్రాలకు బాలకృష్ణ రిక్వెస్ట్