పవర్ స్టార్ పవర్ కళ్యాణ్.. సుజీత్ యాక్షన్ ఎంటర్‌ టైనర్  ఓజీ షూటింగ్  గురించి తాజా అప్ డేట్ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తోంది. ఈమూవీ షూటింగ్ చాలా వరకూ  కంప్లీట్ అయ్యింది. ఇంతకీ ఓజీ షూటింగ్ అప్ డేట్ ఏంటీ..?  

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈభారీ యాక్షన్ డ్రామా మూవీని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ డ్రైవ్ చేస్తుండగా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిపరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో పవర్ స్టార్ కు జతగా.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వీరితో పాటు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ ను హైదరాబాద్‌లో పూర్తి చేసుకున్నారు మూవీ టీమ్. ఈసినిమా దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అంతే కాదు ఈ షెడ్యూల్ లో.. యాక్షన్, ఎపిక్‌నెస్ మరియు డ్రామా...తో కూడిన మూడు అద్భుతమైన షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. అంతే కాదు ఈ అద్భుత మైన షెడ్యూల్స్ లో సీన్స్ దుమ్ము రేపేవిధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూడు షెడ్యూల్స్ తో... ఓజీ షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ రాబోయే షూటింగ్ షెడ్యూల్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారనున్నట్టు తెలుస్తోంది. 

 ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తాజాగా పూర్తయిన షెడ్యూల్ పట్ల చిత్ర బృందమంతా ఎంతో ఆనందంగా ఉంది.అంతే కాదు షూటింగ్ టైమ్ లో సుజిత్ ప్రణాళిక అద్భుతంగా ఉందంటున్నారు. చాలా రెస్పాన్స్బులిటీతో... సుజీత్ అద్భుతమైన ప్రణాళిక మరియు సమన్వయంతో, పాన్-ఇండియన్ తారాగణం నటిస్తున్న సంక్లిష్టమైన సన్నివేశాలను కూడా సులభంగా చిత్రీకరిస్తూ ఉత్తమమైన అవుట్ పుట్ రాబడుతుండటం పట్ల మేకర్స్ సంతోషంగా ఉన్నారు. జూలై, ఆగస్ట్‌ లో జరగనున్న షెడ్యూల్స్‌తో, మొత్తం షూటింగ్‌ను త్వరగా ముగించాలని భావిస్తున్నారు. 

ఇక ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన అవుట్‌పుట్ పట్ల టీమ్ చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా థియేటర్‌లలో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.ఇటీవల ఓజీ యొక్క కొన్ని రష్‌లను చూసిన అర్జున్ దాస్, విజువల్స్ మరియు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి తాను ఫిదా అయ్యాయని, ఇది నిజమైన 'అగ్ని తుఫాను' అని పేర్కొన్నారు. అలాగే శ్రియా రెడ్డి మరియు ఇమ్రాన్ హష్మీ ఇద్దరూ కూడా తాము ఓజీ కథని ఎంతలా ఇష్టపడ్డారో ఇప్పటికే చెప్పారు. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్‌ జోడిని తెరపై చూడాలని సినీప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

దర్శకుడు సుజీత్ అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించాలని ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.