బిగ్ బాస్ షోపై పూనమ్ కౌర్ కామెంట్స్.. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవద్దు
సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది.. కానీ పరోక్షంగా మాత్రమే.
సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది.. కానీ పరోక్షంగా మాత్రమే. అప్పట్లో పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి.
తాజాగా పూనమ్ కౌర్ తెలుగు బిగ్ బాస్ షోని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. ఆదివారం రోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభం కాబోతోంది. ఈ తరుణంలో పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
'తెలుగు టెలివిజన్ చానల్స్ కి నా రిక్వస్ట్. రియాలిటీ షోలకు కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే ముందు వారి బ్యాగ్రౌండ్ చెక్ చేయండి. వినోదం క్రిమినల్ యాక్టివిటీస్ గా మారకూడదు. ఇప్పటికే డ్యామేజ్ జరిగింది' అని పూనమ్ కౌర్ కామెంట్స్ చేసింది.
బిగ్ బాస్ షోలో గొడవలు వైలెన్స్ కి దారితీస్తున్నట్లు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై ఆ మధ్యన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. నూతన్ నాయుడు లాంటి వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. పూనమ్ కౌర్ ట్వీట్ వెనుక ఉద్దేశం ఇదే అని నెటిజన్లు అంటున్నారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా మరోసారి బిగ్ బాస్ బరిలో దిగుతున్నారు. ఈసారి బిగ్ బాస్ సరికొత్తగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.