తన క్లాసిక్ `పెళ్లిసందడి`కి 25ఏళ్లు.. రాఘవేంద్రరావు ఎమోషనల్..త్వరలోనే `పెళ్లిసందd`..
శ్రీకాంత్ హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ `పెళ్లిసందడి`. తాజాగా ఈ సినిమా నేటి(మంగళవారం)తో 25ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు తన ఆనందాన్ని పంచుకుంటూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన సూపర్ హిట్ చిత్రాల్లో `పెళ్లిసందడి` ఒకటి. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించారు. అశ్వనీదత్, అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా జనవరి 12, 1996లో సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ఆదరణ పొందింది. తాజాగా ఈ సినిమా నేటి(మంగళవారం)తో 25ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు తన ఆనందాన్ని పంచుకుంటూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
`పెళ్లి సందడి` నేటికి సినిమా విడుదలై 25ఏళ్లు అయ్యింది. నా కెరీర్లో, శ్రీకాంత్ కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనేనిలిచపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణికి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్లకు నమస్కరిస్తున్నాను` అని ట్వీట్ చేశారు రాఘవేంద్రరావు. ఇక ఈ సినిమా మూడు నంది అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు హిందీలో, తమిళంలో రీమేక్ కూడా చేశారు. అక్కడ కూడా ఆకట్టుకుంది.
ఇందులో పాటలు ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `సౌందర్యలహరి.. స్వప్న సుందరి..`, `రమ్యకృష్ణ లాగ ఉంటదా..`, `హృదయమనే కోవెలలో వెలిగే దీపం..`, `సరిగమ పదనిస రాగం..`, `నవమన్మథుడా.. అతి సుందరుడా..` పాటలను వింటే ఇప్పటికే మనసు ఉల్లాసాన్ని పొందుతుంది. సరికొత్త అనుభూతికి లోనవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు రాఘవేంద్రరావు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా `పెళ్లిసందd`ని రూపొందించబోతున్నట్టు ప్రకటించారు. దీనికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా, ఆయన సహాయకురాలు గౌరీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు తాజాగా వెల్లడించారు. చివరగా `ఓం నమోవెంకటేశాయ` చిత్రాన్ని నాగార్జున హీరోగా రూపొందించారు.