ఫ్లైట్ జర్నీ చేస్తూ దొంగతనం చేసిన అకీరా నందన్.. తన దగ్గర కాస్ట్లీ థింగ్స్ ఉన్నప్పటికీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ముద్దుల తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నాడు. అకీరా నందన్ ఎక్కడ కనిపించినా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ముద్దుల తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నాడు. అకీరా నందన్ ఎక్కడ కనిపించినా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడే మెగా అభిమానులు అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు అంటూ ఆరా తీస్తున్నారు.
ఎందుకంటే అకీరా నందం ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్, సంగీతంలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెట్టాడు. పవన్, రేణు దేశాయ్ విడిపోవడంతో అకీరా ఎక్కువగా తన తల్లితోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక వీలుచిక్కినప్పుడల్లా హైదరాబాద్ కు వస్తుంటాడు. తన తండ్రితో, తన మెగా ఫ్యామిలీతో గడుపుతుంటాడు. ఇటీవల ఖుషి రీరిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఇక రేణు దేశాయ్ తరచుగా తన కుమారుడి విశేషాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అకీరా ఏం చేసినా మురిసిపోతూ ఉంటుంది. తాజాగా అకీరా వేసిన దొంగ వేషాలని రేణు దేశాయ్ బయట పెట్టింది. అకీరా ఏకంగా ఫ్లైట్ జర్నీలో దొంగతనం చేశాడట. అయితే ఆయా దొంగతనం చేసింది తన దగ్గరే అని రేణు దేశాయ్ తెలిపింది.
అకీరాకి కావలసిందల్లా దొరుకుతుంది. అన్ని కాస్ట్లీ వస్తువులు ఉంటాయి. అయినా ఎందుకు దొగతనం చేశాడు అనుకుంటున్నారా. ఫ్లైట్ లో అకీరా ఉపయోగించే ఇయర్ ఫోన్స్ బ్యాటరీ అయిపోయిందట. పక్కనే కూర్చుని ఉన్న రేణు దేశాయ్ దగ్గర పాత ఇయర్ ఫోన్ సెట్ ఉంటే సైలెంట్ గా ఈ మెగా కుర్రాడు దొంగిలించి ఉపయోగించుకున్నాడు.
ఈ విషయాన్ని రేణు దేశాయ్ వీడియో తీసి మరీ పోస్ట్ చేసింది. దీనితో ఈ క్యూట్ వీడియో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తల్లీకొడుకులు అనుబంధం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
విడిపోయినప్పటికీ పిల్లల కోసం పవన్, రేణు దేశాయ్ తరచూ కలుస్తూ ఉంటారు. ఆ మధ్యన అకీరా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ఇద్దరూ హాజరయ్యారు.