అనుపమ పై మండిపడ్డ పవన్ ఫ్యాన్స్, క్షమాపణ చెప్పింది
నటి అనుపమ పరమేశ్వరన్ కూడా వకీల్సాబ్ చూసినట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక్కడే అనుపమపై పవన్ ఫ్యాన్స్ కు కోపం వచ్చింది. అసలేం జరిగింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కొంతమంది అనుపమ పరమశ్వేరన్ పై మండిపడుతున్నారు. అందుకు కారణం ఏమిటా అని చాలా మంది ఆశ్చర్యపోతూ ఆ ట్వీట్స్ ని పరిశీలుస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా వచ్చిన చిత్రం వకీల్సాబ్. బాలీవుడ్ పింక్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ ఇమేజ్కు తగ్గట్లు కథలో మార్పులు చేసి వేణు శ్రీరామ్ కి దర్శకుడిగా మంచి వచ్చింది. ప్రస్తుతం వకీల్సాబ్ అమేజాన్ ప్రైమ్లో రికార్డ్ స్దాయిలో వ్యూస్ తెచ్చుకుంటూ సందడి చేస్తోంది. ఈ సినిమాని చూసిన చాలా మంది అమేజాన్లో సినిమాలను చూశామంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే నటి అనుపమ పరమేశ్వరన్ కూడా వకీల్సాబ్ చూసినట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక్కడే అనుపమపై పవన్ ఫ్యాన్స్ కు కోపం వచ్చింది. అసలేం జరిగింది.
సినిమా చూశానని పోస్ట్ చేస్తే ఫ్యాన్స్ కు ఎందుకు కోపం వచ్చిందనేగా మీ డౌట్… రీసెంట్ గా అమేజాన్ ప్రైమ్లో వకీల్ సాబ్ సినిమా చూసిన అనుపమ ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో.. “తాజాగా వకీల్సాబ్ను చూశాను. మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమాలో అందరి నటన అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ ముగ్గురు అమ్మాయిలను కాపాడే పాత్రతో హద్దులను చెరిపేశారు. ప్రకాశ్ రాజ్ సర్.. మీ నటన అద్భుతం” అంటూ క్యాప్షన్ జోడించారు.
అయితే అనుపమ ఇక్కడే పవన్ ఫ్యాన్స్ కు దొరికి పోయింది. ట్వీట్లో కేవలం ప్రకాశ్ రాజ్నే సార్ అని సంబోధించడంతో… పవన్ అభిమానులు.. కోపం వచ్చింది “కేవలం ప్రకాశ్ రాజ్ ఒక్కరే మీకు సార్ ఆ..?” అంటూ కామెంట్ల వర్షం కురపించారు. దీంతో అనుపమ వెంటనే మరో ట్వీట్ చేశారు. “నన్ను క్షమించండి నా తప్పును తెలుసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారిపై నా ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుంది” అంటూ ట్వీట్ చేశారు.