#Hit2:‘హిట్ 2’ ఓటిటి రిలీజ్ డేట్
నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.
టాలీవుడ్ స్పెషల్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం హిట్ ది సెకండ్ కేస్. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020లో ఆయనే తెరకెక్కించిన హిట్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్-2 చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా వసూళ్ల పరంగానూ బాగానే వర్కవుట్ అయ్యింది. మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం థియేటర్ రన్ దాదాపు పూర్తైనట్లే. ఈ క్రమంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ బయిటకు వచ్చాయి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫాం భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు ఓటీటీ ట్రేడ్ లో ... హిట్ 2 చిత్రానికి భారీగా బిజెనెస్ జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో హిట్ 2 చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ను సొంతం చేసుకుంది. హిట్ టాక్ తెచ్చుకునవ్న ఈ సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా తీవ్రంగా పోటీ పడగా.. చివరకు ప్రైమ్ వీడియోకే భారీ ధరకు ఈ రైట్స్ దక్కాయి. ఓటీటీలో ఈ సినిమా జనవరి నెలలో విడుదలకు ప్లాన్ చేసిన్నట్లు తెలుస్తోంది.
జనవరి నెల మొదటి వారంలో జనవరి 2, జనవరి 6 కానీ రిలీజ్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ . హిట్ టాక్ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు మూడు రోజుల వీకెండ్ కలెక్షన్స్ దుమ్ము రేపాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ 'హిట్ 2' లో అడివి శేష్ ఓ మర్డర్ మిస్టరీ పరిశోధన చేసే అధికారిగా కనపడతాడు. కలెక్షన్స్ వైజ్ గా సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది.
ఇక హిట్ 2లో రొటీన్ ట్విస్ట్ అయినా... స్క్రీన్ ప్లే బాగుంటుంది.హత్య చేసింది సీరియల్ కిల్లర్ అనే ముందే చెప్పారు. ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలనే చంపుతున్నారనేది సస్పెన్స్గా పెట్టారు. ఫస్టాఫ్ అంతా సింపుల్గా కొనసాగుతుంది. హీరో రొమాన్స్.. మధ్యలో కేసు విచారణ.. ఈక్రమంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సింపుల్గా ఉంటుంది. సెకండాఫ్ నుంచి కథ పరుగులు పెట్టించటమే కలిసొచ్చింది.నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్గా పనిచేయగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు.