‘ఆర్టికల్ 370’పై వస్తున్న తొలి చిత్రం.. అదీ తెలుగులో!
గతంలో వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సాయికిరణ్ అడివి ఆర్టికల్ 370 అంశాన్ని స్పృశిస్తూ `ఆపరేషన్ గోల్డ్ ఫిష్` సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆది సాయికుమార్, సాషా ఛెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, మనోజ్ నందం, అబ్బూరి రవి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు.
ఈ రోజు ఎక్కడ చూసినా ‘ఆర్టికల్ 370’ గురించే చర్చలు జరుగుతున్నాయి. దాంతో చాలా మంది దర్శక,నిర్మాతలు ఈ ఇష్యూపై సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయమై ఆర్టికల్ 370పై ఓ తెలుగు సినిమా రానుండం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. కశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370, 35A రద్దు కావడం.. ఆ అంశం పైనే టాలీవుడ్లో సినిమా రానుండటం విశేషం గా చెప్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి..?
.గతంలో వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సాయికిరణ్ అడివి ఆర్టికల్ 370 అంశాన్ని స్పృశిస్తూ `ఆపరేషన్ గోల్డ్ ఫిష్` సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆది సాయికుమార్, సాషా ఛెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, మనోజ్ నందం, అబ్బూరి రవి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఆది సాయికుమార్ ఈ చిత్రంలో ఎన్.ఎస్.జి కమెండోగా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతన్నాయి. సెప్టెంబర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ..‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమా కథను సిద్ధం చేయడానికి తనకు మూడేళ్ల సమయం పట్టిందని, కాశ్మీరీ పండిట్స్ కుటుంబాలను కలిసి పరిస్థితులను తెలుసుకున్నానని చెప్పాడు. కొన్నేళ్లుగా వారి హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటాన్ని తెలుసుకున్నానని, రాజకీయాలు, దేశభక్తి అనే అంశాలతో పాటు చిన్న ప్రేమకథను కూడా ఈ సినిమాలో మిళితం చేశామని తెలిపాడు. 370, 35A ఆర్టికల్స్ను భారత ప్రభుత్వం రద్దు చేసినప్పుడు చాలా ఆనందమేసిందని, ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని సాయికిరణ్ అడివి తెలిపారు.