అన్న కళ్యాణ్ రామ్ ఎప్పుడు ఆపదలో ఉన్నా ఆదుకోవడానికి తమ్ముడు ఎన్టీఆర్ సిద్ధంగా ఉంటారు. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసారకు ఆయన విశేష ప్రచారం కల్పిస్తున్నారు.
అప్పట్లో వరుస ప్లాప్స్ లో కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా నష్టపోయాడు. అన్నను ఆర్ధికంగా ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో జై లవకుశ మూవీ చేశారు. ఆ మూవీ మంచి విజయం అందుకోగా కళ్యాణ్ రామ్ పోగొట్టుకున్నది రాబట్టాడు. ఇక తాజా చిత్ర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ని బాగా వాడేస్తున్నాడు. అన్న బింబిసార చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎన్టీఆర్ తీసుకున్నారు. ట్రైలర్ తో బింబిసార సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఆగష్టు 5న బింబిసార(Bimbisara) మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో జులై 29న చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది. మొదట్లో బాలయ్య సైతం బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తారని ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి దీనిపై అధికారిక సమాచారం లేదు. ఎన్టీఆర్ మాత్రమే వస్తున్నట్లు ప్రకటన చేశారు.
నేడు ఎన్టీఆర్(NTR) బింబిసార ప్రోమో తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఆగస్టు 5న బిగ్ స్క్రీన్ పై బింబిసార చూసి అందించాలని కామెంట్ చేశారు. బింబిసార అందరూ చూడాలంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బింబిసారకు సీక్వెల్స్ ఉంటాయని, ఎన్టీఆర్ కూడా నటించవచ్చని కళ్యాణ్ రామ్ చెప్పడం ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిరేపుతోంది. కళ్యాణ్ రామ్ తన మార్కెట్ కి మించి భారీ బడ్జెట్ తో బింబిసార తెరకెక్కించారు.
బింబిసార చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించారు. కాథెరిన్ థెరిసా హీరోయిన్ గా నటిస్తున్నారు. యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు చాలా కాలం తర్వాత ఓ పబ్లిక్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఫ్యాన్స్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.