NTR: అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి ధైర్యాన్ని నింపిన ఎన్టీఆర్.. ఫోన్కాల్ వీడియో వైరల్
అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానితో ఎన్టీఆర్ ఫోన్లో మాట్లాడారు. వారికి ధైర్యాన్ని నింపారు. త్వరగా కోలుకోవాలని, తాము అండగా ఉంటామని తెలిపారు.
యంగ్ టైగర్, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్(Ntr).. అభిమానుల కోసం ఏమైనా చేస్తారు. వారు ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడంలోనూ ముందే ఉంటారు. అభిమానుల యోగక్షేమాలు సైతం పట్టించుకుంటూ వారికి మరింత దగ్గరవుతున్నారు. అభిమానుల ఆరాధ్య నటుడయ్యారు. తాజాగా అనారోగ్యంతో బాధ పడుతున్న అభిమానితో మాట్లాడారు ఎన్టీఆర్. ఫోన్లో మాట్లాడి ధైర్యాన్ని నింపాడు. వారి అమ్మతోనూ మాట్లాడి ఆమెకి భరోసాని, ధైర్యాన్నిచ్చారు. తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నారు Jr Ntr.
జనార్థన్ అనే అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనార్థన్ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. దీంతో అభిమాన హీరోతో మాట్లాడాలనుకున్నారు. అంతే అభిమాన సంఘం నాయకుల ద్వారా ఎన్టీఆర్కి విషయం చేరింది. తన అభిమాని జనార్థన్ అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న తారక్.. వెంటనే ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని, దేవుడిపై భారం వేయాలని తెలిపారు.
ఇందులో ఆయన చెబుతూ, `జనార్థన్ నేను ఎన్టీఆర్ని మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా కోలుకుని వస్తే, మనం త్వరలోనే కలుద్దాం. దేవుడిపై నమ్మకం, భారం పెట్టు. మేం అందరం నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. త్వరగా కోలుకుని వచ్చేయి, నిన్ను చూడాలని నాక్కూడా ఉంది` అని తెలిపారు తారక్. వాళ్ల అమ్మగారితోనూ ఫోన్ మాట్లాడుతూ ఆమెకి భరోసా ఇచ్చారు. తన సహకారం ఉంటుందని చెప్పారు. తన కోడుకు కోసం తాను కూడా ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తారక్ వారి అమ్మతో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక ఎన్టీఆర్ ఇటీవల `ఆర్ఆర్ఆర్`తో మెరిసిన విషయం తెలిసిందే. ఇందులో కొమురం భీమ్ పాత్రలో నటించి అబ్బురపరిచారు. అద్భుతమైన నటనతో మంత్రముగ్దుల్ని చేశారు. నట విశ్వరూపం చూపించారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో `ఎన్టీఆర్ 30` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని తెలుస్తుంది. మరోవైపు `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్తోనూ ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.