డమ్మీ ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్..వీకెండ్ నుంచే
7 జూలై నుంచి షూట్ లో పాల్గొంటారు. ఈ వీకెండ్ లో కొన్ని డమ్మి ఎపిసోడ్స్ షూట్ జరుగుతుంది. వచ్చే నెల నుంచి ఈ షో ప్రారంభం కానుంది. మొత్తానికి 'రండి గెలుద్దాం... ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ పిలవటానికి రెడీ అయ్యిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ను ఎవరు మీలో కోటీశ్వరుడు అని పేరు మార్చి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ శర వేగంగా జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ షూటింగ్ జరుగుతున్నా కూడా ఈషో కోసం కూడా కొన్ని డేట్స్ ఇచ్చాడు తారక్. ఒక్కో ఎపిసోడ్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు జూనియర్ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ తో ఈ షో ఉండకపోవచ్చు అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ కేవలం రూమర్స్ అంటూ కొట్టిపారేసి ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ షోకు మెరుగులు దిద్దుతున్నారు నిర్వాహకులు. ఈ షో స్పెషాలిటీ ఎంటర్టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా కావటంతో కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనటానికి ఎన్టీఆర్ కు 15 రోజులు టైమ్ ఉంది. దాంతో ఆ టైమ్ ని వినియోగించుకునేందుకు ఈ షో షూట్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు 7 జూలై నుంచి షూట్ లో పాల్గొంటారు. ఈ వీకెండ్ లో కొన్ని డమ్మి ఎపిసోడ్స్ షూట్ జరుగుతుంది. వచ్చే నెల నుంచి ఈ షో ప్రారంభం కానుంది. మొత్తానికి 'రండి గెలుద్దాం... ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ పిలవటానికి రెడీ అయ్యిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఇక ఎన్టీఆర్ తాజా చిత్రం విషయానికి వస్తే..యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్ మరో హీరోగా కనిపించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ను రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్తో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్, రామ్చరణ్కు జంటగా బాలీవుడ్ భామ ఆలియాభట్ సందడి చేయనున్నారు. అంతేకాకుండా బాలీవుడ్, హాలీవుడ్కు చెందిన పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా రెండు పాటలు బాలెన్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తైంది.