Asianet News TeluguAsianet News Telugu

నిర్మాత నాగవంశిని ఇరికించిన నితిన్, ప్రొడ్యూసర్ ఫన్నీ రిప్లై

 టికెట్ డబ్బులు నాగ వంశీనే వాపస్ ఇస్తాడని.. ఆయనకి తనకు చాలా లావాదేవీలు ఉన్నాయని నితిన్...

Nithin about producer Naga Vamsi at Song Launch event jsp
Author
First Published Dec 3, 2023, 1:28 PM IST

ఏదో ఒక ఫన్ లేకపోతే వివాదం  లేకపోతే జనం దృష్టి ఆ సినిమాలపై పడటం లేదు. అందుకోసం నిర్మాతలు, హీరోలు, దర్శకులను ప్రక్కన పెట్టి ప్రమోషన్స్ లో ఇనేషియేషన్ తీసుకుంటున్నారు. గత నెలలో వచ్చిన మ్యాడ్ అనే చిన్న సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓపెన్ ఛాలెంజ్ లో  ఒక వెరైటీ ఆఫర్ ఇచ్చాడు నిర్మాత నాగ వంశీ. సూపర్ హిట్ చిత్రం జాతిరత్నాలు  కంటే మ్యాడ్ మూవీకి తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ ఇచ్చేస్తానని ఛాలెంజ్ చేశాడు. అయితే మ్యాడ్ మూవీలో కామెడీ ఫరవాలేదనిపించటం, ఆ చాలెంజ్ ని లైట్ తీసుకోవటంతో ఎవరు నుంచీ  కంప్లైంట్స్ లేవు.  అయితే   ఇప్పుడు హీరో నితిన్  తన సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఇలాంటి ఛాలెంజే చేశాడు. మ్యాడ్ సినిమాను గుర్తుచేస్తూ అతనీ ఛాలెంజ్ చేసారు.

తన కొత్త చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రెస్ మీట్లో నితిన్ మాట్లాడుతూ.. మ్యాడ్ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని నిర్మాత నాగ వంశీ అన్నాడని.. తాను కూడా ఎక్స్ట్రా విషయంలో అలాంటి సవాలే చేస్తున్నానని.. ఈ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే టికెట్ డబ్బులు నాగ వంశీనే వాపస్ ఇస్తాడని.. ఆయనకి తనకు చాలా లావాదేవీలు ఉన్నాయని నితిన్ నవ్వుతూ అన్నాడు. ఇదే స్టేట్మెంట్ ని నితిన్ రిపీట్ చేస్తూ  నాగవంశీని ఇరికించడం మంచి ఫన్ గా మారింది. దీనితో నాగవంశీ తన రిప్లై ఇచ్చాడు. ఆరోజు మ్యాడ్ వైబ్ లో అలా అనేసాం నితిన్ స్వామీ ఇప్పుడు మీరు ఇలా లాక్ చేస్తే ఎలా? అంటూ తానూ ఫన్ రిప్లై సమాధానంగా అందించాడు. దీనితో వీరి ఫన్ కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . 

వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకులకు ముందుకు రానున్న సంగతి తెలిసిందే.కామెడీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ డాక్టర్ రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. నితిన్ మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఇప్పటికే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్‌ యేర్నేని, వై రవి శంకర్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios