అన్నయ్య వరుణ్ తేజ్కి నిహారిక రాఖీ గిఫ్ట్
మెగా డాటర్ నిహారికా.. తన అన్నయ్య వరుణ్ తేజ్కి రాఖీ పండుగ సందర్బంగా అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. అన్నా చెల్లెలి అనుబంధాన్ని చాటే ఓ అద్భుతమైన పాటని వరుణ్కి అంకితమిస్తున్నట్టు ప్రకటించింది.
మెగా డాటర్ నిహారిక తన అన్నయ్యకి గిఫ్ట్ ఇచ్చింది. హీరో వరుణ్ తేజ్కి రాఖీ పండుగకి ముందే స్పెషల్ గిఫ్ట్ నిచ్చింది. ఓ పాటని అంకితం చేసింది. అన్న, చెల్లెలి అనుబంధం చాటే పాటని పంచుకుంది నిహారిక. `అన్నయ్యా నువ్వు పిలిస్తే.. ` లిరికల్ పాటని తన అన్నయ్య వరుణ్ తేజ్ అంకితం చేస్తున్నట్టు తెలిపింది. తన ఇన్స్టా స్టోరీస్లో ఈ విషయాన్ని వెల్లడించింది నిహారిక. ప్రస్తుతం ఈ పాట ఉన్నట్టుంది వైరల్గా మారింది.
అవికాగోర్, నవీన్ చంద్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `బ్రో`. అన్నా చెల్లెలి అనుబంధం, అనురాగం, ఆప్యాయతలు తెలిపే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. రాఖీ పండుగని పురస్కరించుకుని ఈ చిత్రంలోని `అన్నయ్యా నువ్వు పిలిస్తే..`అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటని సింగర్సునీత పాడటం విశేషం. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్రా సంగీతం అందిస్తున్నారు.
నిహారిక గతేడాది డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వైవాహిక జీవితంలో బిజీగా ఉంది.మరోవైపు తన ప్రొడక్షన్లో వెబ్ సిరీస్ని నిర్మిస్తుంది నిహారిక. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం `గని`, `ఎఫ్3` చిత్రాల్లో నటిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయులు వరుణ్తేజ్, నిహారిక అనే విషయం తెలిసిందే.