“సర్కారు వారి పాట” టీమ్ కు నిద్రలేని రాత్రిళ్లు
పరశురామ్ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఇటీవలే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది.
మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఇటీవలే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో నటిస్తున్న కీ ఆర్టిస్ట్ లు అంతా షూట్ లో పాల్గొంటున్నారు. ఎవరకీ నిద్ర ఉండటం లేదట. అందుకు కారణం...ఈ షూటింగ్ ని రాత్రిళ్లు జరుపుతున్నారు. మరో వారం పాటు నాన్ స్టాప్ గా రాత్రిళ్లు షూట్ జరగనుంది.
ఇక ఇందులో సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నడట. పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతోంది. దుబాయ్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా కొత్త షెడ్యూల్ మొదలైంది. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జున్ విలన్గా కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై మరింత క్లారిటీ రానుందని సమాచారం.
ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ ఎనలేని అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం నుంచి ఇదివరకు టైటిల్ పోస్టర్ తప్ప, మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకొనే అంత అప్డేట్స్ ఏమి రాలేదు. అయితే ఈసారి ఫ్యాన్స్ ను ఏమాత్రం డిస్పాయింట్ చేయకుండా మహేష్ లుక్ ను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా సర్కారు వారి పాట నుంచి సర్ ప్రైజ్ రానున్నట్లుగా తెలుస్తోంది. టీజర్ కూడా వస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. మహేష్ లుక్ ను మాత్రమే రివీల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.