Nayanthara: స్టూడెంట్స్ కు బిర్యానీ వడ్డించిన నయనతార, సెలబ్రేషన్స్ లో లేడీ సూపర్ స్టార్
కాలేజీ విద్యార్ధులతో సరదాగా గడిపారు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె స్టూడెంట్స్ కు స్వయంగా వడ్డించారు కూడా.
![Nayanthara Sarved Biryani For College Students In Movie Celobrations JMS Nayanthara Sarved Biryani For College Students In Movie Celobrations JMS](https://static-ai.asianetnews.com/images/01hgvs7p1k195z6tzhv280ek6j/1-jpg_363x203xt.jpg)
తమిళ పరిశ్రమలో దూసుకుపోతోంది హీరోయిన్ నయనతార. వరుస సినిమాలతో పాటు.. వెబ్ మూవీస్ కూడా చేస్తూ.. బీజీ అయిపోయింది. వయస్సు పెరుగుతున్నాకొద్ది ఆమె డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం సినిమాకు 15కోట్ల వరకూ తీసుకుంటూ..టాప్ లో కోనసాగుతోందట నయనతార. ఇక ఆమె తాజాగా నటించిన సినిమా అన్నపూరణి . నయన్ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కిందీమూవీ. ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇక ఈ సినిమా డిసెంబర్ 01న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాదు తమిళనాట మంచి టాక్ తో ప్రస్తుతం థియేటర్లలో స్క్రీనింగ్ అవుతోంది మూవీ. ఇక ఈమూవీ సక్సెస్ అవ్వడంతో మూవీ టీమ్ అంతా సెలబ్రేషన్స్ చేసకున్నారు. చెన్నైలోని ఓ లేడీస్ కాలేజిని సందర్శించి అక్కడే ఈ మూవీ సెలబ్రేషన్స్ ను జరిపారు. కాలేజీని సందర్శించిన వారిలో హీరోయిన నయనతారతో పాటు హీరో జై కూడా ఉన్నారు. వీరు కాలేజీకి రావడంతో..అక్కడ స్టూడెంట్స్ ఆనందంతో కేరింతలు కొట్టారు. సెలబ్రిటీస్ ను చూడటానికి పోటీ పడ్డారు.
ఈక్రమంలో నయనతార టీమ్ అక్కడే లంచ్ చేశారు.. స్టూడెంట్స్ తో కలిసి తిన్నారు. యనతార, జై లు లంచ్ టైమ్లో స్టూడెంట్స్తో ముచ్చటించి.. వారికి నయన్ స్వయంగా బిర్యానీ వడ్డించారు. ఇక నయనతార, జై లను చూడగానే ఆ స్టూడెంట్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈమూవీ విషయానికి వస్తే.. ఈనెల 31న ఈసినిమా జీ5 లో స్ట్రీమింగ్ కఅవ్వబోతోంది.
కట్టుబాట్ల మధ్య పెరిగిన ఒక బ్రహ్మణ యువతి చెఫ్ గా మారాలి అనుకుంటే ఎదురయ్యే సవాళ్లేంటి. నాన్ వేజ్ లాంటివి వండాల్సి వచ్చినప్పుడు తాను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసింది. మరీ ముఖ్యంగా కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా స్టోరీ. ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.