'తిమ్మరుసు' ని నారా లోకేష్ డైలాగ్ నిలబెట్టేస్తోంది
అప్పట్లో లోకేశ్ మజ్జిగ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
సత్యదేవ్ తాజా చిత్రం తిమ్మరసు. థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్ అయిన ఈ చిత్రం థియేరట్స్ వద్ద సినీ ప్రియలకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. అయితే అనుకున్న స్దాయిలో కలెక్షన్స్ రావటం లేదు. జనం కరోనా థర్డ్ వేవ్ కు భయపడుతున్నారని , అందుకే రావటం లేదని అంటున్నారు. వరసపెట్టి డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించిన సత్యదేవ్ ఈ చిత్రంలో లాయర్ గా కనపడ్డాడు. ఈ సినిమాలో ఓ డైలాగు ఇప్పుడు వైరల్ అవుతోంది. అది నారా లోకేష్ ని గుర్తు చేస్తూండంటతో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ డైలాగు ఏమిటంటే..
సీరియస్ గా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన బలం. సుధాకర్ పాత్రలో బ్రహ్మాజీ కామెడీ బాగుంది. ముఖ్యంగా ఓ సందర్భంలో హీరో సత్యదేవ్తో కలిసి బొండం తాగుతూ బ్రహ్మాజీ చెప్పిన ‘తియ్యగుందీ’ అనే డైలాగ్కి థియేటర్స్లో ఓ రేంజ్లో రెస్పాన్స్ వస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళగిరి ప్రచారంలో నారా లోకేశ్.. ఓ మజ్జిగ తాగుతూ.. ‘ఏం వేశావు ఇందులో.. చక్కెరా.. ‘తియ్యగుందీ’ అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఎంతగా ట్రోల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అప్పట్లో లోకేశ్ మజ్జిగ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే డైలాగ్ను తిమ్మరసు సినిమాలో రిపీట్ చేయడంతో థియేటర్లో లోకేశ్ను గుర్తు చేసుకున్నారు ప్రేక్షకులు. మరోసారి లోకేశ్పై జోకులు పేలుస్తూ నెట్టింట ట్రోల్స్, మీమ్స్లు క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక తెలివైన లాయర్గా నటించిన సత్యదేవ్ ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసును రీఓపెన్ చేస్తాడు. హత్యకేసు వెనకాల ఉన్న చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే రామచంద్ర చివరాఖరకు కేసు గెలుస్తాడా?లేదా అన్న అంశాలపై ఈ చిత్రం తెరకెక్కించింది. మర్డర్ మిస్టరీగా విడుదలైన తిమ్మరుసు చిత్రానికి రెస్పాన్స్ బాగుంది. ఈ చిత్రంలో సత్యదేవ్ లాయర్ పాత్రలో మెప్పిస్తాడు.