నాని, సుజీత్ మూవీపై ఏంటీ డైలమా?.. ఆ రెండు ప్రొడక్షన్ల మధ్య పోటీ..?
నాని, సుజీత్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతుంది. గ్యాంగ్ స్టర్ మూవీగా ప్లాన్ చేశాడు దర్శకుడు. అయితే ఇది బడ్జెట్ కారణంగా ఆగిపోయిందట.
నాని కెరీర్ `దసరా` చిత్రంతో టర్న్ తీసుకుంది. మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అప్పటి వరకు ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరుతెచ్చుకున్న నాని ఇమేజ్ని పూర్తిగా మార్చేసింది `దసరా`. ఆ తర్వాత భారీ మాస్, యాక్షన్ మూవీలు చేస్తున్నాడు. హీరోగా నెక్ట్స్ లెవల్కి వెళ్తున్నాడు. స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నానికి సంబంధించిన ఓ ప్రాజెక్ట్ ఇప్పుడు డైలమాలో పడటం ఆశ్చర్యంగా మారింది.
ప్రస్తుతం నాని.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో `సరిపోదా శనివారం` చిత్రంలో నటిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేరాఫ్గా నిలిచే వివేక్ ఆత్రేయ రూట్ మార్చి యాక్షన్ సైడ్ వచ్చాడు. `సరిపోదా శనివారం` మూవీ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇది ఆగస్ట్ చివరి వారంలో రిలీజ్ కానుంది. దీంతోపాటు మరో యాక్షన్ మూవీ చేస్తున్నారు నాని. `ఓజీ` ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించబోతున్నారు.
ఇదిలా ఉంటే బడ్జెట్ సమస్యలు తలెత్తాయట. గ్యాంగ్స్టర్ మాఫియా ప్రధానంగా సినిమాని తెరకెక్కించబోతున్నారు సుజీత్. ఇందులో నాని గ్యాంగ్ స్టర్ పాత్రని పోషిస్తున్నారట. అయితే సినిమా బడ్జెట్ వంద కోట్లు దాటుతుందట. అంతటి బడ్జెట్ నానిపై అంటే రిస్క్ అని భావించిన నిర్మాత తాను బేర్ చేయలేనని చేతులెత్తేశాడట. దీంతో సినిమా ఆగిపోయిందని తెలిసింది. అయితే ఇప్పుడు మరో రెండు నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. సినిమాని ఎలాగైనా తీయాలని సుజీత్ ఉన్నాడు, నాని కూడా అదే ఫీలింగ్లో ఉన్నాడు. దీంతో మరో రెండు బ్యానర్లని లైన్లోకి తీసుకొచ్చాడు.
ఈ క్రమంలో సితార ఎంటర్టైన్మెంట్, నిహారిక ఎంటర్టైన్మెంట్తో ఇప్పుడు చర్చలుజరుగుతున్నట్టు సమాచారం. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ తో నాని ఇప్పటికే `శ్యామ్ సింగరాయ్` మూవీ చేశాడు. సితారలో `జెర్సీ` చేశాడు నాని. దీంతో ఆ పరిచయాలతో సుజీత్ మూవీని సెట్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ రెండింటిలో ఎవరికి ఈ మూవీ దక్కుతుందో చూడాలి. కానీ నాని సినిమాకి ఇలాంటి డిస్కషన్ అనేది ఆశ్చర్యంగా మారింది.