Asianet News TeluguAsianet News Telugu

నాగార్జునని టెన్షన్‌ పెడుతున్న `రీమేక్‌` సెంటిమెంట్‌.. `నా సామి రంగ` దాన్ని బ్రేక్‌ చేస్తుందా?

నాగార్జున ఈ ఆదివారం `నా సామి రంగ` మూవీతో రాబోతున్నారు. అయితే ఆయన్ని ఓ విషయం భయపెడుతుందట. `రీమేక్‌` సెంటిమెంట్‌ ని బ్రేక్‌ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
 

nagarjuna worry about naa saami ranga remake sentiment will it break that arj
Author
First Published Jan 13, 2024, 11:18 PM IST

కింగ్‌ నాగార్జున `బిగ్‌ బాస్‌ 7` క్లిక్‌ కావడంతో ఆ జోరులో ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతికి `నా సామి రంగ` సినిమాతో వస్తున్నాడు. కంటెంట్‌ చూసుకుని ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. బిజినెస్‌ కూడా బాగానే అయ్యింది. ఓటీటీ డీల్‌ గట్టిగానే సెటిల్‌ అయ్యిందట. సుమారు 18కోట్ల బిజినెస్ అయితే, ముప్పైకోట్లకుపైగా ఓటీటీ డీల్‌ సెట్‌ అయ్యిందట. హాట్‌స్టార్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఓటీటీతో నాగ్‌కి డైరెక్ట్ లింక్‌ ఉండటంతో బాగానే వర్కౌట్‌ చేసినట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే సినిమాపై బజ్‌ లేదు, ఈ సినిమా కోసం పెద్దగా ఎదురుచూసే జనాలు కూడా లేరు. `గుంటూరు కారం`, `హనుమాన్‌` ముందు నిలవలేకపోతుంది. ఇప్పటికైతే వాటిని బీట్‌ చేసే హైప్‌ రాలేదు. మరి రిలీజ్‌ తర్వాత వస్తుందేమో చూడాలని అంతా వెయిట్ చేస్తున్నారు. దీనికితోడు మరో ముఖ్యమైన విషయం నాగ్‌ని టెన్షన్‌పెడుతుంది. అదే ` రీమేక్‌`. ఇటీవల కాలంలో రీమేక్‌ సినిమాలు ఏదీ ఆడటం లేదు. ఏదో చూట్టేస్తున్నారు. తెలుగులో గత రెండేళ్లలో వచ్చిన రీమేక్‌ సినిమాల్లో ఒకటి రెండు తప్ప మాగ్జిమమ్‌ పరాజయం చెందాయి. 

దీంతో నాగార్జున `నా సామి రంగ`కి కూడా రీమేక్‌ సెంటిమెంట్‌ భయపెడుతుందట. ఆయన లోలోపల చాలా టెన్షన్‌ పడుతున్నారు. రీమేక్ సినిమాలను ఆడియెన్స్ చూడటం లేదనే విషయం ఇటీవల చాలా సినిమాల విషయంలో నిరూపితమైంది. పవన్‌ `బ్రో` మూవీ కూడా అలానే డిజాస్టర్‌ అయ్యింది. మరి నాగార్జున మూవీని చూస్తారా? అనేది పెద్ద ప్రశ్న. ఈ విషయంలోనే మన్మథుడు కాస్త టెన్షన్‌గా ఉన్నాడట. 

దీనికితోడు నెగటివ్‌ ప్రచారం కూడా జరగ్గకుండా జాగ్రత్త పడుతున్నారట. అందుకే యూఎస్‌లోనూ ప్రీమియర్స్ లేట్‌గా వేస్తున్నారట. ఏడుగంటల తర్వాతే ప్రీమియర్స్ పడుతున్నట్టు తెలుస్తుంది. దీనిప క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి నెగటివ్‌ రాకుండా చాలా మ్యానేజ్‌ చేస్తున్నారట. మార్నింగ్‌ షోలకు, ఓపెనింగ్స్ పై ప్రభావంపడకుండా చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఎంత వరకు ఇది వర్కౌట్‌ అవుతుందో చూడాలి. అలాగే రీమేక్‌పై నెలకొన్న సెంటిమెంట్‌ని ఇది బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. అన్నట్టు ఇది మలయాళంలో హిట్‌ అయిన `పొరింజు మరియం జోసే` చిత్రానికి రీమేక్‌. తెలుగులో అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ నటిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios