#Adipurush: టీజర్ పై ముఖేష్ ఖన్నా షాకింగ్ కామెంట్స్, ఇతర మతాలతో ఇలా చేస్తారా?
ఆదిపురుష్ టీజర్ మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. బాలీవుడ్ ప్రముఖులతో పాటు, పలువురు రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఆది పురుష్’ టీజర్పై శక్తిమాన్ పాత్రధారి ముఖేష్ఖన్నా ఘాటుగా స్పందించారు.
ఆదిపురుష్ టీజర్ విడుదలైంది. దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది. అదే సమయంలో టీజర్ అద్భుతంగానే ఉందంటూ డార్లింగ్ అభిమానులు అంటున్నారు. ఎవరేమన్నా అనుకున్న స్థాయిలో లేదనేది నిజం. టీజర్ చూస్తుంటే.. మొత్తం యానిమేషన్ అన్నట్టుగానే సాగింది. ఒక రూంలోనే షూటింగ్ అంతా చేసేసి గ్రీన్ మ్యాట్తో సినిమాను చుట్టేసినట్టు కామెంట్స్ చేస్తున్నారు.
వానర సేన కూడా గొరిల్లాలా కనిపిస్తున్నాయేంటంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆదిపురుష్ టీజర్ మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఆంజనేయుడు సైతం కొత్తగా, వింతగా కనిపిస్తున్నాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు, పలువురు రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఆది పురుష్’ టీజర్పై శక్తిమాన్ పాత్రధారి ముఖేష్ఖన్నా ఘాటుగా స్పందించారు. రాముడు, కృష్ణుడు బాడీబిల్డర్లు కాదని విమర్శించారు.
తాజాగా ‘ఆది పురుష్’ టీజర్ను చూసిన ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేష్ఖన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఇటు రాముడు.. రాముడిగానూ, అటు హనుమాన్.. హనుమంతుడిగానూ కనిపించడం లేదు. దేవుళ్లు ఎవరూ ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్లా ఉండరు. రాముడు, కృష్ణుడిని చూడండి. వాళ్లేమీ బాడీ బిల్డర్స్ కాదు. వాళ్ల ముఖాలు సున్నితంగా, విధేయతతో ఉంటాయి. కోమలమైన సౌందర్యం కలిగి ఉంటారు తప్ప గడ్డాలు, మీసాలు కలిగి ఉండరు’’ అని కాస్త ఘాటూగానే స్పందించారు.
అలాగే ‘‘సినిమాకు ‘ఆది పురుష్’ అని పెట్టారు. బాగానే ఉంది. ఆ పేరు పెట్టుకున్నప్పుడు రాతియుగపు మనిషి స్టోరీ చెప్పి ఉంటే బాగుండేది. కానీ, రామాయణాన్ని ఎంచుకుని, సినిమా చేయాలనుకుంటే పాత్రలు, వాటి ఆహార్యం మార్చాల్సింది. ప్రేక్షకుల విశ్వాసంతో మీరు ఆటలాడుతున్నారు. రూ.100 నుంచి రూ.1000కోట్లు పెట్టి, వీఎఫ్ఎక్స్తో చిత్రాన్ని తీస్తానంటే అది రామాయణం అయిపోదు. అది విలువలు, ప్రతిభలపై ఉంటుంది. ‘అవతార్’ను స్ఫూర్తిగా తీసుకుని, పాత్రలను తీర్చిదిద్దటం సరైంది కాదు.
ఈ విధంగా రామాయణ పాత్రలతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటే, ప్రజలు మిమ్మల్నే చూసి నవ్వటమే కాదు, వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఇదొక ఫిక్షనల్ స్టోరీ అంటూ మీరు చెప్పుకోవచ్చు. కానీ, దయచేసి రామాయణం అని మాత్రం చెప్పకండి. సంప్రదాయాలు, మత విశ్వాసాలు, ఇతిహాసాలను మార్చడానికి డబ్బులు వృథా చేయకండి. ఇతర మతాలతో ఇలాగే చేయగలరా’’ అని అంటూ ముఖేష్ఖన్నా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మరో ప్రక్క పొన్నియన్ సెల్వన్ దెబ్బతో ఇప్పుడు తమిళ ప్రేక్షకులు మన మీద గుర్రుగా ఉన్నారు. వారు అయితే ఈ సినిమాను కొచ్చాడియన్తో పోలుస్తున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ చిత్రం 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో రూపొందించబడింది, వీటిలో ఎక్కువ భాగం VFX కోసం ఖర్చు చేయబడింది. కానీ ప్రేక్షకులకు అందించిన అవుట్పుట్ ప్రేక్షకులు ఆశించిన దానికి దూరంగా ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో మీమ్స్ మరియు ట్రోల్లను అప్లోడ్ చేయడం ద్వారా చిత్ర నిర్మాతలను ట్రోల్ చేస్తూ అభిమానులు తమ ఎమోషన్స్ ని వెల్లడిస్తున్నారు. ‘ఆదిపురుష్’కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ మొదలుపెట్టారు.