యాంకర్ ప్రదీప్ నన్ను రేప్ చేయలేదు: 139 మంది రేప్ కేసు బాదితురాలు
గతంలో ప్రదీప్ తనను రేప్ చేశాడంటూ కేసు పెట్టిన యువతి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రదీప్కు ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. డారల్ భాయ్ అనే వ్యక్తి తనను తీవ్రంగా హింసించి, కొట్టి కావాలనే కొంత మంది ప్రముఖుల పేర్లు కేసులో పెట్టించాడని చెప్పింది.
ఏకంగా 139 మంది తనను రేప్ చేశారంటూ మిర్యాలగూడ చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన విషయం సంచలనంగా మారింది. ఈ కేసు ఎస్ఎఫ్ఐకి చెందిన లీడర్లతో పాటు పలువురు సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్టుగా వార్తలు రావటంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ముఖ్యంగా స్టార్ యాంకర్ ప్రదీప్, వినాయకుడు ఫేం కృష్ణుడు పేర్లు కూడా కేసులో ఉండటంతో ఈ కేసు మరింతగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పటికే యాంకర్ ప్రదీప్, కృష్ణుడు తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రదీప్, తన కుటుంబం ఎంతో మనో వేదన అనుభవిస్తోందని ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు.
కృష్ణుడు కూడా తనకు ఆ అమ్మాయి ఎవరో తెలియదని, కోర్టులో తమపై వచ్చిన ఆరోపణలపై పోరాడతామని వెల్లడించాడు. అయితే తాజాగా ఆ యువతి యూటర్న్ తీసుకుంది. గతంలో ప్రదీప్ తనను రేప్ చేశాడంటూ కేసు పెట్టిన యువతి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రదీప్కు ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.
డారల్ భాయ్ అనే వ్యక్తి తనను తీవ్రంగా హింసించి, కొట్టి కావాలనే కొంత మంది ప్రముఖుల పేర్లు కేసులో పెట్టించాడని చెప్పింది. తన వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఈ రోజు నిజం చెబుతున్నానంటూ వెల్లడించింది ఆ యువతి.
తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకోగా కీలక సూత్రధారి డాలర్ భాయ్ కోసం వేట కొనసాగుతోంది.