మాస్ ట్రీట్ కు రెడీ అవుతున్న రవితేజ, హ్యాట్రిక్ హిట్ పై కన్నేసిన స్టార్ హీరో, రావణాసుర ట్రైలర్ మహూర్తం ఫిక్స్
హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈసారి ఏలాగైనా మిస్అవ్వదంటూ.. పట్టుదలతో ఉన్నాడు. ఈక్రమంలో ఫ్యాన్స్ కోసం తన కొత్త సినిమా నుంచి ట్రీట్ ల మీద ట్రీట్ లు అందిస్తున్నాడు స్టార్ హీరో.
బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొడుతున్నాడు మాస్ మహారాజ రవితేజ. చాలా కాలం హిట్టు సినిమా లేక ఇబ్బంది పడ్డ సీనియర్ హీరో.. రీసెంట్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు రవితేజ పోయిన సంవత్సరం చివరలో ధమాకా అంటూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపించిన మాస్ హీరో.. అంతకు ముందూ క్రాక్ సినిమాతో లైన్ లో పడ్డాడే. ఇక ఈ ఏడాది మెగాస్టరా్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టి బాక్సాఫీస్ దగ్గర పటాకులు పేల్చాడు.
వరుసగా హిట్లు కొడుతూ వస్తున్నమాస్ మహారాజ్.. ప్రస్తుతం హ్యాట్రిక్పై కన్నేశాడు. ఒక రకంగా వాల్తేరు వీరయ్యసినిమాతో రవితేజ హ్యాట్రిక్ కొట్టినట్టే అని చెప్పవచ్చు... కాని ఈసినిమాలో మెయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవి అవ్వడంతో.. రవితేజ సోలోగా హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. క్రాక్, ధమాకా సినిమాల తరువాత మాస్ మహారాజ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను రిలీజ్ కు ముస్తాబు చేస్తున్నారు టీమ్.
రావణాసుర సినిమాపై మాస్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈసినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతూ వస్తున్నాయి. మూవీ టీమ్ కూడా ఈ క్రేజ్ ను క్యాచ్ చేసి.. దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే అన్నీప్లాన్ చేసుకుంటున్నారు. ఈక్రమంలో రావణాసుర సినిమా నుంచి తాజాగా ట్రైలర్ డేట్ను అనౌన్స్ చేశారు టీమ్.
రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రావణాసుర మూవీ ట్రైలర్ను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ను రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు మేకర్స్. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ కాస్త నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఈసినిమాకు రావణాసుర టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీలో రవితేజ కోసం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా ఈ మూవీలో సందడి చేయబోతున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈసినిమాలో రవితేజ తో పాటుగా అక్కినేని హీరో.. సుశాంత్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.