Asianet News TeluguAsianet News Telugu

మణిరత్నం హిస్టారికల్ మల్టీస్టారర్ లేటెస్ట్ అప్డేట్

ఫెమస్ నవలారచయిత కల్కీ రాసిన 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే హిస్టారికల్ నవల ఆధారంగా మణిరత్నం సినిమాను తెరక్కేక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 800కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే సినిమాకు సంబందించిన స్పెషల్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

maniratnam ponniyin selvan latest update
Author
Hyderabad, First Published Sep 6, 2019, 12:45 PM IST

ఫెమస్ నవలారచయిత కల్కీ రాసిన 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే హిస్టారికల్ నవల ఆధారంగా మణిరత్నం సినిమాను తెరక్కేక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 800కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే సినిమాకు సంబందించిన స్పెషల్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

సినిమాలో మొత్తం 12పాటలు ఉంటాయట. ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ ఈ హిస్టారికల్ ఫిల్మ్ కి సంగీతం అందించనున్నారు. సినిమా కోసం కొత్త తరహా మ్యూజిక్ ని కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్ గా క్లాసిక్ స్టైల్ లో ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ బిగ్ ప్రాజెక్ట్ లో సౌత్ - నార్త్ కి సంబందించిన స్టార్ నటీనటులను మణిరత్నం సెలెక్ట్ చేసుకున్నారు 

ప్రస్తుతం పొన్నియన్‌ సెల్వన్‌' ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఎండింగ్ లో చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనుంది. ఈ సినిమాలో కార్తీ - జయంరవి - అమితాబ్ బచ్చన్ అలాగే ఐశ్వర్య రాయ్ - కీర్తి సురేష్ - అమలాపాల్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios