ఆ పొలిటీషిన్ కు ఉ** పడాలంటూ మంచు విష్ణు
చాలా కాలంగా రకరకాల వివాదాలతో రిలీజ్ అవుతుందో లేదో డైలమోలో ఉన్న మంచు విష్ణు హీరో తాజా చిత్రం 'ఓటర్'.
చాలా కాలంగా రకరకాల వివాదాలతో రిలీజ్ అవుతుందో లేదో డైలమోలో ఉన్న మంచు విష్ణు హీరో తాజా చిత్రం 'ఓటర్'. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం ఓటర్ గొప్పతనం, ఓటు ప్రాముఖ్యత గురించి చర్చిస్తుంది. అయితే ఎలక్షన్స్ మూడ్ అయ్యిపోయి, రిజల్ట్స్ కూడా వచ్చేసి , ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పుడు రిలీజ్ అవుతూండటంతో ఎంతవరకూ ఇంపాక్ట్ చూపుతుందనేది అనుమానమే. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా తాజాగా చిత్రం ట్రైలర్ విడుదల చేసారు.
ట్రైలర్ లో ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తరవాత వాళ్లను పట్టించుకోని రాజకీయ నాయకుల పనిపట్టే ఓటర్గా ఈ సినిమాలో మంచు విష్ణు కనిపించబోతున్నాడని అర్దమవుతోంది. ప్రజలను మోసం చేసిన రాజకీయ నాయకులను తన తెలివితేటలతో హీరో ఎలాంటి గుణపాఠం నేర్పాడో చూపిస్తున్నారు.
జిఎస్ కార్తీక్ దర్శకుడు. రమా రీల్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని జాన్సుధీర్ పూదోట నిర్మిస్తుండగా, సురభి హీరోయిన్గా నటిస్తుంది. ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంపత్రాజ్, నాజర్, పోసాని కృష్ణముళి, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
నిర్మాత జాన్ సుధీర్ మాట్లాడుతూ – ‘‘మంచు విష్ణు తొలిసారి నటించిన పొలిటికల్ డ్రామా ఇది. ఓటు విలువను తెలియజేసే చిత్రం. షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: రాజేష్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమల.