జనవరి 26న జరగాల్సిన గుంటూరోడు ఆడియో వేడుక వాయిదా
- జనవరి 26న విపక్షాల ఆందోళనలకు పిలుపు
- ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో మిన్నంటుతున్న ఆందోళనలు
- ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిందేనంటున్న మంచు మనోజ్
మంచు మనోజ్ తాజా చిత్రం గుంటూరోడు. చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఆడియో లాంచ్ జనవరి 26 న జరగనున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే ఈ చిత్ర ఆడియో లాంచ్ వాయిదా పడినట్లు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ చిత్ర ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.మనోజ్ తన సన్నిహితుల సలహా మేరకే ఆడియో లాంచ్ ని వాయిదా వేసినట్లు తెలిపాడు. కాగా ఈ చిత్రంలో మనోజ్ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
జనవరి 26న విపక్షాలన్నీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళన తలపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నానని, ప్రేమతో అహింసాత్మక పోరాటం ద్వారా హోదా సాకారం కావాలని భావిస్తున్నానని ఈ సందర్భంగా మనోజ్ అభిప్రాయపడ్డారు.