Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో అయితే నన్ను చూసి లేచి నిలబడతారు.. ఆ హీరోయిన్ వల్లే ముంబైకి వచ్చేశా, మంచు లక్ష్మి

మంచు లక్ష్మి అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఏకంగా ఈ బోల్డ్ బ్యూటీ మకాం ముంబైకి మార్చేసినట్లు తెలుస్తోంది. బి టౌన్ లో మంచు లక్ష్మి ఆఫర్స్ వేట మొదలు పెట్టింది.

manchu lakshmi latest comments shifting hyderabad to mumbai dtr
Author
First Published Nov 24, 2023, 2:44 PM IST

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో కొంతకాలం నటిగా రాణించింది మంచు లక్ష్మి. యాంకర్ గా కూడా సత్తా చాటింది. కానీ ఆ తర్వాత మంచు లక్ష్మికి ఆఫర్స్ కరువయ్యాయి. మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది. 

అయితే మంచు లక్ష్మికి ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ లేవు. దీనితో మంచు లక్ష్మి అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఏకంగా ఈ బోల్డ్ బ్యూటీ మకాం ముంబైకి మార్చేసినట్లు తెలుస్తోంది. బి టౌన్ లో మంచు లక్ష్మి ఆఫర్స్ వేట మొదలు పెట్టింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

టాలీవుడ్ లో, తెలుగు రాష్ట్రాల్లో మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. ఇదే విషయాన్ని మంచు లక్ష్మి కాస్త భిన్నంగా చెప్పింది. హైదరాబాద్ లో అయితే నన్ను చూసి నిలబడతారు. అలాంటి స్థాయి నాకు అక్కడ ఉంది. కానీ ముంబైలో ప్రతిదీ మొదటి నుంచి ప్రారంభించాలి. ముంబైలో నన్ను నేను పరిచయం చేసుకోవాలి. కానీ నాకు ఛాలెంజ్ అంటే ఇష్టం. ఎప్పుడూ ఒకే చోట ఉండడం నాకు ఇష్టం లేదు అని మంచు లక్ష్మి పేర్కొంది. 

రానా దగ్గుబాటి ఒకసారి ముంబైలో బిజినెస్ గురించి చెప్పినప్పుడు నాకు కూడా ఇక్కడకి రావాలని అనిపించింది. అయితే ముంబై లాంటి మహానగరంలో ఇల్లు దొరకడం కష్టం. నా బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ సహాయం చేసింది. నా కోసం ముంబై దాదాపు 100 ఇల్లు వెతికింది. అందులో బెస్ట్ హౌస్ ని తాను సెలెక్ట్ చేసుకున్నట్లు మంచు లక్ష్మి పేర్కొంది. 

నేను అమెరికాలో షోలు చేశాను. సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేశాను. కానీ ముంబై నాకు ఛాలెంజ్. హిందీలో మాట్లాడడం.. ఇక్కడే ఉండి అవకాశాలు సాధించడం నాకు నిజమైన ఛాలెంజ్ అని మంచు లక్ష్మి పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios