Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య కి హీరోయిన్ సెట్టైంది,ఏజ్ గ్యాప్ సరిపోతుందా?

 మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎంపిక చేసారు. ఓరు మురై వంతు పార్థాయ అనే సినిమాలోని పార్వతి పాత్రలో తన అభినయంతో ఈ మలయాళీ భామ ప్రశంసలు అందుకుంది. మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘పిసాసు’(పిశాచి) చిత్రానికి ఆమె ఉత్తమ కొత్త తమిళ నటిగా ఎంపికైంది. ప్రస్తుతం ఒక గౌతమ్ మీనన్ అంథాలజీ ప్రాజెక్టు లో నటిస్తోంది. అయితే బాలయ్య ప్రక్కన ఆమె మరీ చిన్న పిల్లలా ఉంటుందనే టాక్ నడుస్తోంది సోషల్ మీడియాలో. 

Malayalam beauty locked for Balakrishna jsp
Author
Hyderabad, First Published Oct 16, 2020, 8:00 AM IST


బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సినిమా అంటే ఫ్యాన్స్ కు  పండగే. గ‌తంలో వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సెన్సేషన్ హిట్ అయ్యాయి. తాజాగా వీరు మ‌చ్చ‌ట‌గా మూడో సినిమా చేస్తూ, హ్యాట్రిక్ కొట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మార్చిలో షూటింగ్ మొద‌లెట్టారు కూడా. అయితే క‌రోనా కార‌ణంగా ఆ తర్వాత షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ చ‌క్క‌ర్లు కొడుతోంది. అది హీరోయిన్ గురించి.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కథ ప్రకారం   ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందిట. మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎంపిక చేసారు. ఓరు మురై వంతు పార్థాయ అనే సినిమాలోని పార్వతి పాత్రలో తన అభినయంతో ఈ మలయాళీ భామ ప్రశంసలు అందుకుంది. మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘పిసాసు’(పిశాచి) చిత్రానికి ఆమె ఉత్తమ కొత్త తమిళ నటిగా ఎంపికైంది. ప్రస్తుతం ఒక గౌతమ్ మీనన్ అంథాలజీ ప్రాజెక్టు లో నటిస్తోంది. అయితే బాలయ్య ప్రక్కన ఆమె మరీ చిన్న పిల్లలా ఉంటుందనే టాక్ నడుస్తోంది సోషల్ మీడియాలో. 

అలాగే సీనియర్​ నటి మీనా ఈ మూవీలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని ఆ వార్త సారాంశం. ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని, నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. మాస్ మసాలా సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, బాలకృష్ణ కాంబినేషన్ లో గతం లో వచ్చిన పవెర్ ఫుల్  టైటిల్స్ కి భిన్నంగా ఈ చిత్రానికి పెట్టారని తెలుస్తోంది. మొదటగా "మోనార్క్" అనే టైటిల్ ఆల్ మోస్ట్ కన్ఫాం చేసారంటున్నారు.
. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత కంపోజర్. 

Follow Us:
Download App:
  • android
  • ios