SVP :చాలా చోట్ల షాకిచ్చేలా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే?!
సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, పరశురాం తెరకెక్కించారు.
మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మొన్న గురువారం రోజు (మే 12) మొదలైంది. ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట వేసిన ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది. రివ్యూలన్నీ తేడాగానే అనిపించాయి. అయితే ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద చూపించలేదు. కొన్ని చోట్ల వీకెండ్ థియోటర్స్ పెంచారని వినిపించింది. ముఖ్యంగా మహిళలకు ఈ సినిమా బాగా నచ్చుతోందని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంగా నెగిటివ్ టాక్ ని తట్టుకుని ఈ సినిమా ఈ వీకెండ్ లో ఏ మేరకు నిలబడిందో చూద్దాం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలంగాణా కన్నా ఆంధ్రాలో ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. ఫస్ట్ వీకెండ్లో సర్కారు వారి పాట భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 133 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ 100 కోట్లు దాటింది. ఓవర్సీస్లో వసూళ్లు 2 మిలియన్ దాటింది. మరో 35 కోట్లు వస్తే సర్కారు వారి పాట సేఫ్జోన్లోకి వచ్చినట్లే అని చెప్తున్నారు. ఇదే పరిస్దితి రన్ అయితే ఈ వారాంతానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి. మరో ప్రక్క అమెరికాలో $2 మిలియన్ (Rs 14.5 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఈ రోజు నుంచే అసలైన ఛాలెంజ్ ఈ సినిమా ఎదురు కానుంది.
అలాగే ‘దూకుడు’ సినిమాలో హీరో, హీరోయిన్, వెన్నెల కిషోర్ మధ్య విదేశాల్లో తీసిన రొమాంటిక్ ట్రాక్ ఎలా మెప్పించిందో అలా ఇందులోనూ అమెరికాలో సాగే సీన్లు ఆకట్టుకుంటున్నాయి. మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగానే ఉండటం కలిసొచ్చే అంశం.
సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, పరశురాం తెరకెక్కించారు. ఈ మూవీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది.