సర్కారు వారి పాట చిత్రంలో సితార మెరుపులు మెరిపించబోతోంది. పెన్నీ సాంగ్ లో సితార స్టెప్పులేయడం ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు మాస్ యాటిట్యూడ్ తో నటిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ మూవీ. దీనితో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మహేష్ కి జోడిగా ఈ మూవీలో కీర్తి సురేష్ నటిస్తోంది. సర్కారు వారి పాట చిత్రం నుంచి శనివారం విడుదలైన 'పెన్నీ' సాంగ్ ప్రోమో సెన్సేషనల్ గా మారింది.
ఈ సాంగ్ లో మహేష్ బాబుతో కలసి సితార స్టెప్పులేయడం ఫ్యాన్స్ కి ఊహించని సర్ ప్రైజ్. ప్రోమోలో సితార స్టెప్పులు చూస్తుంటే ఫుల్ సాంగ్ వెంటనే చూడాలనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నేడు కంప్లీట్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.
పెన్నీ సాంగ్ పై సితార సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సర్కారు వారి పాట లాంటి అమేజింగ్ టీం తో కలసి పనిచేసే ఛాన్స్ రావడం సంతోషంగా ఉందని సితార పోస్ట్ పెట్టింది. 'నాన్న నిన్ను గర్వపడేలా చేస్తా' అని కూడా సితార కామెంట్స్ చేసింది. సితార స్టెప్పులు చూసి మహేష్ బాబు తప్పకుండా మురిసిపోయి ఉంటాడని ఫ్యాన్స్ అంటున్నారు.
సితార సూపర్ స్టైలిష్ గా వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఇక ఫుల్ సాంగ్ లో సితార ఎలా అదరగొట్టిందో చూడాలి. మే 12న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే ఈ చిత్ర కథ ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.