గోవా టు హైదరాబాద్.. స్పెషల్ ఫ్లైట్ లో మహేష్ అండ్ ఫ్యామిలీ
కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం సర్కారు వారి పాట టీమ్ గోవా వెళ్లారు. అక్కడ కీలకమైన రెండు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. గోవా షెడ్యూల్ ముగియడంతో మహేష్ హైదరాబాద్ కి పయనం అయ్యారు.
2020 సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసిన సూపర్ స్టార్ మహేష్... 2022 సంక్రాంతిని టార్గెట్ చేశారు. ఆయన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన జరిగిపోయింది. మరోవైపు పవన్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ సైతం సంక్రాంతి సీజన్ పై కర్చీఫ్ వేసి, బుక్ చేసుకున్నాయి.
దీనితో టాలీవుడ్ టాప్ స్టార్స్ మధ్య సంక్రాంతి పోరు రసవత్తరంగా సాగనుంది. ఇంకా నెలల సమయం మాత్రమే ఉండగా సర్కారు వారి పాట షూటింగ్ త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు మహేష్. తాజాగా కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం సర్కారు వారి పాట టీమ్ గోవా వెళ్లారు. అక్కడ కీలకమైన రెండు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. గోవా షెడ్యూల్ ముగియడంతో మహేష్ హైదరాబాద్ కి పయనం అయ్యారు.
మహేష్ తన సిస్టర్ మంజుల, భార్య నమ్రతతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్నారు. సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ వెంటనే ప్రారంభం కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.