Asianet News TeluguAsianet News Telugu

కరోనా టైమ్ లోనూ కుమ్మేస్తున్న మహేష్ ..కోట్లు సంపాదన

 సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ లో అత్యధిక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నది  మహేష్ బాబు ఒక్కరే. ఈ కరోనా టైమ్ లోనూ అందరూ ఖాళీగా ఉంటే ఆయన యాడ్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ ఎడ్యుకేషన్ యాప్ కు యాడ్ పూర్తి చేసిన ఆయన  చేతిలోకి మరో భారీ ఆఫర్ వచ్చింది. 
 

Mahesh Babu To Turn Brand Ambassador Of Jio TV
Author
Hyderabad, First Published Jul 23, 2020, 8:04 AM IST


సూపర్ స్టార్ మహేష్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఓ ప్రక్కన సినిమాలు చేయటంతో పాటు యాడ్స్ చేసుకుంటూ మంచి మైలేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు.  ఖచ్చితంగా చెప్పాలంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ లో అత్యధిక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నది  మహేష్ బాబు ఒక్కరే. ఈ కరోనా టైమ్ లోనూ అందరూ ఖాళీగా ఉంటే ఆయన యాడ్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ ఎడ్యుకేషన్ యాప్ కు యాడ్ పూర్తి చేసిన ఆయన  చేతిలోకి మరో భారీ ఆఫర్ వచ్చింది. 

దేశంలోనే దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ కొత్తగా జియో టీవీ ప్లస్ ను ప్రారంభించేందుకు సిద్దం అయ్యింది. ఇందులో భాగంగా జియో వారు పబ్లిసిటీ గట్టిగా చేయబోతున్నారు. తాము ఇచ్చే సెటప్ బాక్స్ లో ఛానెల్స్ తో పాటు అమెజాన్.. నెట్ ఫ్లిక్స్.. హాట్ స్టార్ వంటి 12 ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రసారాలు చూడవచ్చు. ఒక్క లాగిన్ తో శాటిలైట్ ఛానల్స్ మరియు ఓటీటీ కంటెంట్ చూసే వీలును జియో కల్పించబోతున్నామనే విషయాన్ని జనాల్లోకి ఎంత బాగా తీసుకెళ్తే అంతలా సక్సెస్ అవుతామని వారు నమ్ముతున్నారు. అందుకు సౌత్ నుంచి మహేష్ కు ఆ భాధ్యత అప్పచెప్పబోతున్నారు.

నార్త్ ఇండియాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో జియో టీవీ ప్లస్ కు ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సౌత్ మొత్తం కూడా ఒక్క హీరోతోనే చేయించాలనే ఉద్దేశ్యంతో అన్ని భాషల్లో గుర్తింపు ఉన్న ప్రభాస్ అడిగితే వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత అదే స్దాయి క్రేజ్, గుర్తింపు ఉన్న మహేష్ బాబును సంప్రదించారట. చర్చలు పూర్తి అయ్యాయని అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందంటున్నారు. ఇందుకు మహేష్ బాబుకు భారీ మొత్తమే అందనుంది. 

అంటే ఏడాది పాటు జియో టీవీ ప్లస్ కు సౌత్ ఇండియా మొత్తం మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు. మహేష్ బాబు ఖాతాలో ఇప్పటికే ఎన్నో ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. మరో ప్రక్క ఇప్పటికే క్లాత్ బిజినెస్‌తో పాటు మల్టీప్లెక్స్ రంగంలోనూ రాణిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు పర్ప్యూమ్ కూడా మొదలుపెడుతున్నాడు. ఏదేమైనా కూడా సూపర్ స్టార్ దూకుడు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాకు కమిటయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios