బిల్ గేట్స్ ను కలిసిన మహేశ్ బాబు.. ఫొటో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ నోట్ రాసిన సూపర్ స్టార్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో న్యూయార్క్ హాలీడే ట్రిప్ లో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్ బిల్ గేట్స్ ను తాజాగా కలిశారు. ఆయన గురించి ఆసక్తికరంగా స్పందించారు.
‘సర్కారు వారి పాట’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం వేకేషన్ ను ఎంజాయిస్తున్నారు. ఈ సందర్భంగా హాలిడేలో భాగంగా న్యూయార్క్ కు వెళ్లాడు. ఇఫ్పటికే అక్కడి నుంచి పలు ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. సినిమా విజయవంతం కావడంతో ప్రస్తుతం ఇలా వేకేషన్ కోసం యూఎస్ కు వెళ్లాడు. దాదాపు ఆయన ట్రిప్ పూర్తి కావోస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో ఇండియాకు కూడా తిరిగి రానున్నట్టు తెలుస్తోంది.
ఈ వియాహార యాత్రలో భాగంగా మహేశ్ తన భార్య నమ్రతా శిరోద్కర్ మరియు పిల్లలతో కలిసి తాజాగా న్యూ యార్క్ లోని బిగ్ యాపిల్ కు వెళ్లారు. అక్కడే మహేష్ బిల్ గేట్స్ ను కలిసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బిల్ గేల్స్ తో కలిసిన ఓ ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ను పంచుకుంటూ.. మహేష్ ఇలా రాశాడు. ‘మిస్టర్ బిల్ గేట్స్ ను (Billgates)ని కలవడం ఆనందంగా ఉంది! ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు... అత్యంత వినయం కలిగిన వ్యక్తి! స్ఫూర్తివంతుడు!!’ అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే ఇప్పటికే పలు రకాల బిజినెస్ లు కలిగి ఉన్న మహేశ్ బాబు బిల్ గేట్స్ తో భేటీ కావడంతో మరేదైనా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారా? అనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇండియాకు తిరిగి వచ్చాక మహేశ్ SS రాజమౌళి, త్రి విక్రమ్ లతో కలిసి పనిచేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ లతో మహేశ్ మార్కెట్ ఊహించని స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే మహేశ్ ముందుగా త్రివిక్రమ్ మూవీలోనే నటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి వరకు రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.