Asianet News TeluguAsianet News Telugu

గీత గోవిందం దర్శకుడికి మహర్షి ఎఫెక్ట్

చిన్న దర్శకుడైనా.. పెద్ద దర్శకుడైనా.. స్టార్ హీరోలతో వర్క్ చేయాలనీ గోల్ పెట్టుకుంటారు.ఇప్పుడు గీత గోవిందం దర్శకుడి నెక్స్ట్ టార్గెట్ కూడా అదే. పరశురామ్ కి గత కొంత కాలంగా స్టార్ ప్రొడ్యూసర్స్ నుంచి మంచి ఆఫర్స్  వస్తున్నాయి.

maharshi effect on parashuram
Author
Hyderabad, First Published May 22, 2019, 9:45 AM IST

చిన్న దర్శకుడైనా.. పెద్ద దర్శకుడైనా.. స్టార్ హీరోలతో వర్క్ చేయాలనీ గోల్ పెట్టుకుంటారు.ఇప్పుడు గీత గోవిందం దర్శకుడి నెక్స్ట్ టార్గెట్ కూడా అదే. పరశురామ్ కి గత కొంత కాలంగా స్టార్ ప్రొడ్యూసర్స్ నుంచి మంచి ఆఫర్స్  వస్తున్నాయి. కుదిరితే రెమ్యునరేష్ తో పడగొట్టాలని చూస్తున్నారు. అయితే ఈ దర్శకుడు మాత్రం నెక్స్ట్ కూడా గీత ఆర్ట్స్ లోనే మరో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. 

మహేష్ బాబుని ఇటీవల కలిసి మంచి స్టోరీ లైన్ వినిపించిన పరశురామ్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాడు. కానీ ఇంకా మహేష్ నుంచి అఫీషియల్ గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎవరితో కలవనున్నారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. 

రూమర్స్ ప్రకారం మహేష్ మళ్ళీ మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వర్క్ చేయాలనీ అనుకుంటున్నట్లు టాక్. మరో సోషల్ మెస్సేజ్ తో కూడిన యాక్షన్ కథను రెడీ చేసుకొంటున్న వంశీ మహర్షి షూటింగ్ దశలోనే మహేష్ కు స్టోరీ పాయింట్ చెప్పినట్లు సమాచారం. అనిల్ ప్రాజెక్ట్ తరువాత చేద్దామని అప్పట్లో ఒక మాటనుకున్న మహేష్ గీత ఆర్ట్స్ కోరిక మేరకు పరశురామ్ చెప్పిన కథను కూడా విన్నాడు. 

అయితే పరశురామ్ ఎన్నో ఆశలతో మహేష్ కోసం మంచి ప్రాజెక్ట్ ని సిద్ధం చేసుకుంటుండగా మహర్షి సినిమా హిట్టవ్వడంతో చిత్ర దర్శకుడు మరోసారి మహేష్ ను ఆకర్షిస్తున్నాడు. ఈ ఎఫెక్ట్ పరశురామ్ ని వెయిటింగ్ లిస్ట్ పెట్టింది. మరి మహేష్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తాడో పూర్తిగా తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.     

Follow Us:
Download App:
  • android
  • ios