Asianet News TeluguAsianet News Telugu

మహాశివరాత్రి సందర్భంగా సినిమాల సందడి, స్పెషల్ షోస్.. ఏ థియేటర్ ఏ సినిమా అంటే..?

ఈ ఏడాది కూడా ప్రతీ ఏడాది మాదిరిగానే జాగారం కోసం సినిమాలు రెడీ అయ్యాయి. ఈసారి రెండు రెండు షోలతో థియేటర్లు సందడిగా మారబోతున్నాయి. మరి శివరాత్రి సందర్భంగా  ఏ థియేటర్ లో ఏ సినిమాలు సందడిచేయబోతున్నాయో చూసేద్దామా. 

maha shivaratri 2023 movies special shows in hyderabad theatres
Author
First Published Feb 18, 2023, 9:58 AM IST

శివరాత్రి అంటే ఉపవాసం.. జాగారం. ఈరెండు గుర్తుకు వస్తాయి. వెనకట ఉపవాసాలు చేసి... శివనామస్మరణతో ఏ గుళ్లోనో జాగారం చేసేవారు.. కాని రాను రాను పద్దతులు మారిపోయాయి.. జాగారాన్ని బాగా ఊపయోగించకుంటూ.. స్పెషల్ సినిమాలతో థియేటర్లు జనాలను ఆకర్షించాయి. పాత సినిమాలు.. హిట్ సినిమాలను స్పెషల్ షోస్ వేస్తూ... జాగారానికి జాగారం... ఎంటర్టైన్మెంట్ కుఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి థియేటర్లు. ఇక ఈ ఏడాది కూడా ప్రతీ ఏడాది మాదిరిగానే జాగారం కోసం సినిమాలు రెడీ అయ్యాయి. ఈసారి రెండు రెండు షోలతో థియేటర్లు సందడిగా మారబోతున్నాయి. మరి శివరాత్రి సందర్భంగా  ఏ థియేటర్ లో ఏ సినిమాలు సందడిచేయబోతున్నాయో చూసేద్దామా. 

రీసెంట్ గా రిలీజ్అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యమూవీ. ఈసినిమానుమహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ షోల ద్వారా ప్రదర్శించబోతున్నారు ఈరోజు. సంధ్య 70mm థియేటర్ లో రాత్రి.. వాల్తేరు వీరయ్య సినిమాను రెండు షోలు వేయనున్నారు. రాత్రి 12 గంటలకు ఒక షో స్టార్ట్ కాబోతుండగా.. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు మరో  షోను సంధ్య థియేటర్ లో మెగా అభిమానుల కోసం ప్రదర్శించబోతున్నారు. 

మూడు థియేటర్లలో.. సందడి చేయబోతుంది అల్లు అర్జున్ పుష్ప మూవీ. శివరాత్రి సందర్భంగా శ్రీ కృష్ణ థియేటర్ లో రాత్రి 11‌‌.45 నిమిషాలకు షో స్టార్ట్ కాబోతోంది. అలాగే 11. 59 నిమిషాలకు మహాలక్ష్మీ కాంప్లెక్స్ లో కూడా రిలీజ్ కాబోతోంది. వీటితో పాటు మెయిన్ గా సుష్మ థియేటర్ లో 3‌.00 గంటలకు ప్రదర్శించబోతున్నారు అల్లు అర్జున్ సినిమాను. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. 2021 లో రిలీజ్ అయిన ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. 

ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా రెండు థియేటర్లలో సందడి చేయబోతుంది. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని సుదర్శన్ థియేటర్ లో రాత్రి 12 -15 నిమిషాలకు ప్రదర్శించబోతుండగా.. సుష్మా థియేటర్ లో 12-00 గంటలకే అఖండ సినిమాను స్పెషల్ షో వేయబోతున్నారు. 

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ టెంపర్ ను కూడా శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాను దేవి థియేటర్ లో రాత్రి 12 .15 నిమిషాలకు.. సంధ్య థియేటర్ లో 12 గంటల 30 నిమిషాలకు ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. 

ఇక సూపర్ స్టార్.. అభిమానుల కోసం రెండు సినిమాలు స్పెషల్ షో కోసం రెడీగా ఉన్నాయి.  మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ  దూకుడు సినిమాను సుదర్శన్ థియేటర్ లో రాత్రి 12.00 గంటలకు ప్రదర్శించనుండగా... మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాను మహాలక్ష్మీ కాంప్లెక్స్ లో రాత్రి 11. 59 నిమిషాలకు స్పెషల్ షో వేయనున్నారు. అంతే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాను కూడా.. మహాలక్ష్మీ కాంప్లెక్ లో తెల్లవారుజామున 3 గంటలకు స్పెషల్ షో వేయబోతున్నారు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రెబల్ సినిమాను సంధ్య థియేటర్ లో రాత్రి 3 గంటలకు ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమాతో పాటుగా మాస్ మహారాజ్ రీసెంట్ హిట్ ధమాకాను కూడా సంపూర్ణ థియేటర్ లో రాత్రి 11 గంటల 59 నిమిషాలకు ప్రదర్శించబోతున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతారాను  సప్తగిరి థియేటర్ లో రెండు షోలు వేయబోతున్నారు. రాత్రి 12.00 లకు తిరిగి తెల్లవారుజామున 3 .00 లకు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఇలా మహాశివరాత్రి సందర్భంగా తమఅభిమాన తారల సూపర్ హిట్ సినిమాలు ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధం అవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios