Asianet News TeluguAsianet News Telugu

2.0 అప్డేట్: అసలైన బ్లాస్ట్ దీపావళి రోజే!

పూర్తిగా త్రీడి సినిమా కావడం తో సినిమా కోసం దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. చాలా వేగంగా 10 కోట్ల వ్యూవ్స్ ను అందుకొని రికార్డు సృష్టించింది. ఆడియెన్స్ అనుకున్నట్టుగానే టీజర్ ఆకట్టుకుంది. కాకపోతే ఇంకా ఎదో మిస్ అయ్యింది అనేవారు కూడా ఉన్నారు. అయితే నెక్స్ట్ సినిమా స్థాయి పెరిగేలా దర్శకుడు శంకర్ స్పెషల్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.

latest update on 2.0
Author
Hyderabad, First Published Sep 24, 2018, 6:34 PM IST

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 2.0. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత కొంత కాలంగా గ్రాఫిక్స్ పనులల్లో బిజీగా ఉంది. పూర్తిగా త్రీడి సినిమా కావడం తో సినిమా కోసం దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. చాలా వేగంగా 10 కోట్ల వ్యూవ్స్ ను అందుకొని రికార్డు సృష్టించింది. 

ఆడియెన్స్ అనుకున్నట్టుగానే టీజర్ ఆకట్టుకుంది. కాకపోతే ఇంకా ఎదో మిస్ అయ్యింది అనేవారు కూడా ఉన్నారు. అయితే నెక్స్ట్ సినిమా స్థాయి పెరిగేలా దర్శకుడు శంకర్ స్పెషల్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఏకంగా 4 నుంచి 5 నిమిషాల మధ్యలో ఉండే ట్రైలర్ ను కట్ చేస్తున్నట్లు సమాచారం. ఆ ట్రైలర్ పనులు ప్రస్తుతం చెన్నై రెహమాన్ స్టూడియోస్ లో జరుగుతున్నాయి. అసలైన రీ రికార్డింగ్ ను రెహమాన్ ఈ ట్రైలర్ ద్వారా చూపించనున్నాడట. 

ఇక గ్రాఫిక్స్ వర్క్స్ కోసం దాదాపు 3000 మంది  శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 6న ట్రైలర్ ను రిలీజ్ చేసేవిధంగా చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. ఎందుకంటే సినిమాను నవంబర్ 29న రిలీజ్ చెయ్యాలని స్ట్రాంగ్ గా చెప్పేశారు. అందువల్ల సినిమా స్థాయి పెరగాలంటే ట్రైలర్ ఆకట్టుకోవాలని ఈ విధంగా ప్లాన్ చేశారు. మరి 2.0 త్రీడి మ్యానియా ఎంతవరకు బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేస్తుందో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios