Asianet News TeluguAsianet News Telugu

ఆసుపత్రి నుండి సైరాబాను డిశ్చార్జ్ !

77ఏళ్ల సైరాబాను ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసిన ఆమె అభిమానులు ఆందోళన చెందారు.  కోలుకున్న సైరాబాను ఆదివారం నాడు హిందుజా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారట. 

late dilip kumars wife sairabanu discharged from hospital
Author
Hyderabad, First Published Sep 6, 2021, 11:25 AM IST

లెజెండరీ నటుడు లేట్ దిలీప్ కుమార్ సతీమణి సైరాబాను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని సైరాబాను సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆగష్టు 28న సైరాబాను ఊపిరి అందకపోవడం, రక్తపోటు, షుగర్ ప్రాబ్లమ్స్ తో ముంబై హిందుజా ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల అనంతరం ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేశారు వైద్యులు. 


77ఏళ్ల సైరాబాను ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసిన ఆమె అభిమానులు ఆందోళన చెందారు. ఐతే కోలుకున్న సైరాబాను ఆదివారం నాడు హిందుజా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారట. అయితే సైరాబాను అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీనికి చికిత్సగా కరోనరీ యాంజియోగ్రామ్ చేయాలని డాక్టర్స్ సూచించారు. దానికి సైరాబాను నిరాకరించినట్లు సమాచారం అందుతుంది. 
 

సైరాబాను భర్త దిలీప్ కుమార్ 98ఏళ్ల వయసులో ఇటీవల మరణించడం జరిగింది. శ్వాస సమస్యలతో హిందుజా ఆసుపత్రిలో చేరిన దిలీప్ కుమార్ జులై 7న తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తరువాత ఒంటరైన సైరాబాను ఒక్కరే ముంబై నివాసంలో ఉంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios